స్వాతంత్య్ర దినోత్స‌వం కానుకగా గురువారం టాలీవుడ్లో ఇద్ద‌రు యంగ్ హీరోలు త‌మ సినిమాల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డ్డారు. శ‌ర్వానంద్ ర‌ణ‌రంగం, అడ‌వి శేష్ ఎవ‌రు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది ?   ఏ సినిమా పైచేయి సాధించిందో చూస్తే ర‌ణ‌రంగం కంటే ఎవ‌రుకే ఎక్కువ మంది మంచి మార్కులు వేయ‌డంతో పాటు ఎన‌లిస్టులు సైతం ఎక్కువ రేటింగ్ ఇస్తున్నారు.


వెంక‌ట్ రామ్‌జీ దర్శకత్వంలో అడివి శేషు హీరోగా రెజీనా కాసాండ్రా హీరోయిన్‌ గా నవీన్ చంద్ర కీలక పాత్రలో వచ్చిన ఈ థ్రిల్ల‌ర్ మూవీ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. ఓ మిస్సింగ్ కేసు మరియు ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతూ ఇంట్రస్టింగ్ ప్లేతో ఆసక్తికరంగా సాగుతుంది. క్రైమ్ సన్నివేశాలు, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు అడవి శేషు – రెజీనా నటన బాగా అలరిస్తాయి. 


ద‌ర్శ‌కుడు చాలా సీరియ‌స్ స్క్రీన్ ప్లే రాసుకున్నా... కొన్ని స‌న్నివేశాలు అక్క‌డ‌క్క‌డా బోర్ కొట్టినా కూడా ప్రేక్ష‌కులు ఈ సినిమాను ఇష్ట‌ప‌డి మ‌రీ చూస్తున్నారు. ఓవ‌రాల్‌గా చిన్న చిన్న లోపాలు కొట్టుకుపోయి సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. రిలీజ్‌కు ముందే ప్రీమియ‌ర్లు, అడ‌వి శేష్ ప్ర‌మోష‌న్ కూడా ప్ల‌స్ అయ్యాయి. కొత్త‌ద‌నం కోరుకునే ప్రేక్ష‌కుల‌తో పాటు అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నా..,కథాకథనాలు స్లోగా సాగుతూ సినిమా ఆసక్తికరంగా సాగలేదు.దర్శకుడు మంచి పాయింట్ తీసుకున్నా.. ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సినిమాని మలచలేకపోయాడు. మొత్తం మీద ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో ?  చూడాలి. ఏదేమైనా ఈ వారం ర‌ణ‌రంగంపై ఎవ‌రు పై చేయి సాధించింద‌ని ఫ‌స్ట్ డే టాక్‌.



మరింత సమాచారం తెలుసుకోండి: