గత ఏడాది  రంగస్థలం తో  ఇండస్ట్రీ హిట్ సినిమాను ఇచ్చిన  కూడా స్టార్ డైరెక్టర్ సుకుమార్ కు తన తదుపరి సినిమాకు  హీరో ను ఒప్పించడానికి చాలా టైం పట్టింది.  ఈ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయాలనుకున్నాడు సుకుమార్. అందుకు తగ్గట్లే రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఓ కథ సిద్ధం చేసుకొని  మహేష్ కు వినిపించాడు.




అయితే  మహేష్ కు కథ నచ్చక పోవడంతో  సినిమాను చేయలేను అని చెప్పేశాడు.  దాంతో సుకుమార్ మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని  కథలో కొన్ని మార్పులు చేసి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు అదే కథను చెప్పాడు. ఇక ఆ కథకు బన్నీ ఓకే చెప్పాడు. అయితే ఇటీవల మళ్ళీ ఆ కథను  విన్న బన్నీ స్క్రిప్ట్ లో మార్పులు చేయమని కోరాడట.  దాంతో మళ్ళీ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి  బన్నీ కి వినిపించాడట.  ఇక ఆ స్క్రిప్ట్ తో సంతృప్తి  చెందిన బన్నీ ఫైనల్ గా సినిమాకు ఓకే చెప్పాడట. 




ఇక ఈసినిమా ను ఈనెలలో లాంచ్ చేసి  అక్టోబర్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నారని సమాచారం.  మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా అనిరుధ్ సంగీతం అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.   కాగా అల్లు అర్జున్  ప్రస్తుతం  త్రివిక్రమ్ డైరెక్షన్ లో  అల.. వైకుంఠపురములో అనే చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ సినిమాల తరువాత బన్నీ ,ఎంసీఏ ఫేమ్  వేణు శ్రీరామ్  తెరకెక్కించనున్న 'ఐకాన్' అనే చిత్రంలో నటించనున్నాడు. ఈచిత్రానికి  యంగ్ మ్యూజిక్ సెన్సేషన్  అనిరుద్ రవిచంద్రన్  సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: