సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు'. ఇటీవలే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకోగా మూడవ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగనుంది. ఈ షెడ్యూల్ కోసం అక్కడ 4కోట్లా ఖర్చుతో .కర్నూల్ లోని ఫేమస్ ఫోర్ట్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ ను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుండి మొదలు కానున్న ఈషెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఇక మహేష్ , అనిల్ వరుసగా సక్సెస్ లు చూడడం తో ఈసినిమా థియేట్రికల్ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యం లో గుంటూరు థియేట్రికల్ హక్కులను ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ భారీ ధరకు సొంతం చేసుకున్నాడు. గత కొంత కాలంగా మహేష్ తో సన్నిహితంగా మెదులుతున్నాడు మెహర్.. అందుకే ఈ డైరెక్టర్ కు ఆ ఏరియా హక్కులను అమ్మారని తెలుస్తోంది. ఇక గతం లో కేవలం స్టార్ హీరోల తోనే సినిమాలు చేశాడు మెహర్ రమేష్.. అందులో భాగంగా ఆయన తెరకెక్కించిన బిల్లా .,కంత్రి ,శక్తి , షాడో సినిమాల్లో ఒక్కటి కూడా విజయం సాదించలేదు. దాంతో మెహర్ రమేష్ పోటీలో లేకుండా పోయాడు.
మరి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ రూపంలోనైనా ఆయనకు కలిసొస్తుందో చూడాలి. కామెడీ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. వీరితో పాటు సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఏం బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.