సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు'. ఇటీవలే  ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకోగా   మూడవ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగనుంది.  ఈ షెడ్యూల్ కోసం అక్కడ 4కోట్లా ఖర్చుతో .కర్నూల్ లోని  ఫేమస్ ఫోర్ట్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ ను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుండి మొదలు కానున్న ఈషెడ్యూల్ లో  యాక్షన్ సన్నివేశాలను  చిత్రీకరించనున్నారు.




ఇక మహేష్ , అనిల్  వరుసగా సక్సెస్ లు చూడడం తో  ఈసినిమా థియేట్రికల్ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యం లో  గుంటూరు థియేట్రికల్   హక్కులను  ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ భారీ ధరకు సొంతం చేసుకున్నాడు.  గత కొంత  కాలంగా మహేష్ తో సన్నిహితంగా  మెదులుతున్నాడు మెహర్..  అందుకే ఈ డైరెక్టర్ కు  ఆ ఏరియా హక్కులను అమ్మారని తెలుస్తోంది.  ఇక  గతం లో కేవలం స్టార్ హీరోల తోనే సినిమాలు చేశాడు మెహర్ రమేష్.. అందులో భాగంగా  ఆయన తెరకెక్కించిన బిల్లా .,కంత్రి ,శక్తి , షాడో సినిమాల్లో  ఒక్కటి కూడా విజయం సాదించలేదు. దాంతో మెహర్ రమేష్ పోటీలో లేకుండా పోయాడు. 




మరి ఇప్పుడు  సరిలేరు నీకెవ్వరూ రూపంలోనైనా ఆయనకు కలిసొస్తుందో  చూడాలి. కామెడీ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా  కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. వీరితో పాటు సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఏం బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: