టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ రథసారథుల రజతోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో చిరంజీవి ప్రొడక్షన్ మేనేజర్ల గొప్పదనం గురించి మాట్లాడారు. సినిమాల కోసం మేనేజర్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. నేను ప్రత్యక్షంగా మేనేజర్లు పడే కష్టాన్ని చూసానని చిరంజీవి చెప్పారు. ఒక సినిమా కోసం ఆఫీస్ తీసిన సమయం నుండి సినిమా రిలీజ్ అయ్యేవరకు కూడా మేనేజర్లు ఎంతో కష్టపడతారని చిరంజీవి చెప్పారు. 
 
సినిమా షూటింగ్ మొదలైన తరువాత మేనేజర్లు చాలా తక్కువగా నిద్రపోతారని చిరంజీవి చెప్పారు. సినిమా విజయం సాధించటంలో మేనేజర్ల యొక్క కష్టం చాలా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసారు. సినిమా అద్భుతమైన సౌధంలాంటిదని ఆ సౌధానికి పునాది రాళ్లు మేనేజర్లని చిరంజీవి చెప్పారు. ఈ వేడుకను విజయవంతం చేయటం కోసం చలన చిత్ర రంగానికి చెందిన ప్రముఖులందరూ స్వచ్చందంగా వచ్చారని చెప్పారు. 
 
సైరా సినిమా షూటింగ్ లొకేషన్ కోసం మేనేజర్ అవతలి వాళ్ల కాళ్ల మీద పడి అనుమతి తీసుకున్నాడని సినిమా కోసం మేనేజర్లు ఎంతో కష్టపడతారనటానికి ఇదే ఉదాహరణ అని చిరంజీవి చెప్పారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు 32 లక్షల రుపాయలను మేనేజర్స్ యూనియన్ కు కానుకగా ప్రకటించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. చిరంజీవి గారిని కలిసిన తరువాత మాట్లాడుతుంటే కొత్త ఎనర్జీ వస్తుందని మహేశ్ బాబు అన్నారు. 
 
సైరా నరసింహారెడ్డి సినిమాకు మహేశ్ బాబు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అందరికీ మహేశ్ బాబు అభినందనలు తెలిపాడు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ లేకపోతే సినిమా తీయటం సాధ్యం కాదని మహేశ్ అన్నారు. సుమలత, జయప్రద, రాజశేఖర్, సుబ్బరామిరెడ్డి ఇతర ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: