గత నెలలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మార్నింగ్ షో నుండే నెగిటివ్ టాక్ వచ్చింది. 330 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సాహో సినిమా బాలీవుడ్లో మాత్రమే బ్రేక్ ఇవెన్ అయింది. టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, ఓవర్సీస్ లో ఈ సినిమా భారీ నష్టాల్నే మిగిల్చింది. కథ, కథనంలో లోపాలు ఈ సినిమాకు మైనస్ గా మారాయి. 
 
ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ ఏ సినిమాలో నటిస్తాడు అనే విషయం గురించి క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం మేరకు ప్రభాస్ మరలా సుజీత్ దర్శకత్వంలోనే నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సాహో సినిమా విడుదలకు ముందు సుజీత్, ప్రభాస్ మధ్య ఒక చర్చ జరిగిందని తెలుస్తోంది. 
 
ఆ చర్చలో సుజీత్ సాహో ఫలితం గురించి టెన్షన్ పడుతుంటే ప్రభాస్ సుజీత్ తో సాహో సినిమా హిట్టైతే నువ్వు స్టార్ డైరెక్టర్ అయిపోతావ్ నీకు వరుసగా అవకాశాలు వస్తాయి అని చెప్పాడట. సాహో సినిమా ఒకవేళ అనుకున్న ఫలితాన్ని అందుకోకపోతే మాత్రం మరో అవకాశం ఇస్తానని ప్రభాస్ చెప్పాడని తెలుస్తోంది. ఈ సినిమా సాహో బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్ తో మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. 
 
ప్రభాస్ జాన్ సినిమాను కూడా సాహో సినిమాను నిర్మించిన యువి క్రియేషన్స్ నిర్మాతలే నిర్మిస్తున్నారు. దాదాపు 200 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ఎక్కువ భాగం యూరప్ లో షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది. దర్శకుడు రాధాకృష్ణ రాసిన జాన్ సినిమా కథ అద్భుతంగా ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: