సాధారణంగా సినిమాలు ఆదివారం విడుదల కావు. అయితే ఈ విషయంలో కూడ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ ఒక కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టబోతోంది. రాబోతున్న సంక్రాంతి బన్నీ మహేష్ ల వార్ గా మారడంతో వీరిద్దరూ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురంలో’ మూవీల మధ్య విజేత ఎవరు అన్న ఆసక్తి పెరిగిపోయింది.

ఇలాంటి పరిస్థితులలో భారీ రికార్డుల పై కన్నేసిన వీరిద్దరి సినిమాల విడుదల విషయంలో వ్యూహాత్మక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్ మూవీ జనవరి 10 శుక్రు వారం విడుదల అవుతుంటే జనవరి 12 ఆదివారం అల్లు అర్జున్ సినిమా విడుదల అయ్యే విధంగా ఒక రాజీ కుదుర్చుచుకున్నారు.

దీనివల్ల ధియేటర్ల సమస్యలు ఏర్పడవని సంక్రాంతి కలక్షన్స్ ను పోగొట్టుకోకుండా ఈ ఇద్దరు హీరోలు ఎంజాయ్ చేయవచ్చని నిర్మాతల ప్లాన్. అయితే ఈ ప్లాన్ బాగున్నప్పటికీ ఒకే సీజన్ ను టార్గెట్ చేస్తూ రెండు భారీ సినిమాలు విడుదల అయినప్పుడు ఒక సినిమా మాత్రమే భారీ సక్సస్ ను అందుకోగలుగు తుంది అన్న విషయం తెలిసినప్పటికీ బన్నీ మహేష్ లు చేస్తున్న సాహసం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురంలో’ టబు పాత్రను చాల పవర్ ఫుల్ గా తీర్చి దిద్దుతున్నట్లు సమాచారం. దాదాపు ఐదు కోట్ల భారీ బడ్జెట్ తో అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన టబు ఇంటి సెట్ ఈ మూవీకి హైలెట్ గా మారుతుంది అని అంటున్నారు. ఈ మూవీలోని సంభాషణలు అన్నీ త్రివిక్రమ్ బ్రాండ్ ఇమేజ్ కి దగ్గరగా ఉంటూ బన్నీ మార్క్ కామెడీ సీన్స్ తో యూత్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండటమే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడ నచ్చుతాయని టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: