ఎట్టకేలకు మామ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం చూడటానికి బన్నీ కి వీలుకుదిరినట్టుంది....నిన్న సాయంత్రం ఏఎంబీ థియేటర్స్లో సైరా సినిమాను చూసేందుకు వెళ్లారు.ఒక పక్క తెలుగు నాట సైరా వీర విహారం చేస్తూ..... తొలిరోజే తెలుగు రాష్ట్రాల్లో 38 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చింది సైరా నరసింహా రెడ్డి. ఇక ఈ చిత్రాన్ని చూసి తెలుగు ఇండస్ట్రీ పెద్దలతో పాటు మిగిలిన ఇండస్ట్రీల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి.



 ఈ నేపథ్యంలో  ఇప్పటికే మెగా  కుటుంబంలో అంతా సినిమా చూసారు. సుదర్శన్ థియేటర్‌లో మెగా ఫ్యామిలీ అంతా వచ్చి తొలిరోజే సినిమా చూసింది. ఇక ఇప్పుడు బన్నీ కూడా ఏఎంబి సినిమాస్‌లో సైరా సినిమాను చూసాడు. కుటుంబంతో వచ్చి మెగా సినిమాను ఎంజాయ్ చేసాడు స్టైలిష్ స్టార్. ఆయనతో పాటు భార్య స్నేహారెడ్డి.. కుమారుడు అయాన్ కూడా ఉన్నాడు. సినిమా చూసిన తర్వాత చిరంజీవి నటనకు ఫిదా అయిపోయాడు అల్లు అర్జున్. చిత్రయూనిట్ అందరికీ కంగ్రాట్స్ చెప్పాడు బన్నీ.

స్టయిలిష్ స్టార్ బన్నీ  ఫ్యామిలీతో సహా థియేటర్ లో  ప్రత్యక్షమయ్యే సరికి అక్కడి అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. మెగా హీరోలైతే సినిమాను చూసి ఆనందంలో మునిగిపోతున్నారు. 'బాస్' బస్టర్ హిట్ అంటూ కామెంట్లు పెట్టేశారు. సైరా ఘన విజయం సాధించినందుకు మెగా హీరోలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ కాస్త ఆలస్యంగా సినిమాను వీక్షించాడు.  త్రివిక్రమ్ తో చేస్తున్న అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉండటం, కొత్త ఇంటిని నిర్మించే పనిలో నిమగ్నమవడంతో సైరా ను మొదటి రోజే చూడలేకపోయాడని సమాచారం.

అసలే మెగా స్టార్ సినిమా.....వచ్చిందేమో మెగా అల్లుడు....! మరి మెగా ఫాన్స్ వదులుతారా ?సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్‌లో బన్నీ సైరా సినిమా చూడడానికి రావడంతో ప్రేక్షకులు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. థియేటర్ యాజమాన్యం బన్నీ ఫ్యామిలీకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఇక సైరా ఘనవిజయాన్ని పురస్కరించుకుని ‘థాంక్యూమీట్’ ఏర్పాటు చేసింది మూవీ టీమ్.   



మరింత సమాచారం తెలుసుకోండి: