సినిమాల‌కు ఓపెనింగ్స్ చాలా కీల‌కంగా మారిపోయిన ఈ రోజుల్లో ప్ర‌మోష‌న్ల‌కు కూడా ఎన‌లేని ప్రాధాన్యం ఉంటోంది. ఒక‌ప్పుడు షూటింగ్ పూర్తి చేశాక త‌మ‌కేం ప‌ట్ట‌న‌ట్లు ఉన్న పెద్ద పెద్ద స్టార్లు ఇప్పుడు రోజుల త‌ర‌బ‌డి ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంటూ.. దేశ‌వ్యాప్తంగా తిరుగుతూ.. మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ.. అనేక ఈవెంట్ల‌లో పాల్గొంటూ సినిమాను ప్ర‌మోట్ చేస్తున్నారు. ఐతే ఈ ప్ర‌మోష‌న్లు కూడా రొటీన్‌గా ఉంటే జ‌నాల‌కు అంత ఆస‌క్తి ఉండ‌ట్లేదు.ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌ద‌నం చూపిస్తేనే వాళ్ల దృష్టి సినిమా వైపు మ‌ళ్లుతోంది.

దేశంలో సినిమా ప్ర‌మోష‌న్ల‌ను కొత్త పుంత‌లు తొక్కించిన బాలీవుడ్ వాళ్లు.. ఎప్ప‌టిక‌ప్పుడు ఈ విష‌యంలో కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకొస్తుంటారు.హౌస్ ఫుల్-4 టీం ఇప్పుడు త‌మ సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ఈ చిత్ర నిర్మాత సాజిద్ న‌డియాడ్ వాలా.. ఇండియ‌న్ రైల్వేస్ స‌హ‌కారంతో త‌మ సినిమాను స‌రికొత్త‌గా ప్ర‌మోట్ చేయ‌డానికి రంగం సిద్ధం చేశాడు. ఇందుకోసం ఓ ల‌గ్జ‌రీ రైలును రెంటుకు తీసుకున్నాడు. ఆ రైలు బ‌య‌టా లోప‌లంతా హౌస్ ఫుల్ పోస్ట‌ర్ల‌తో నింపేసి.. ఈ చిత్రంలో న‌టించిన ప్ర‌ధాన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లంద‌రినీ తీసుకుని ముంబ‌యి నుంచి ఢిల్లీకి టూర్ వేయ‌బోతున్నాడు.


ముంబ‌యిలో మొద‌లుపెట్టి అక్క‌డ‌క్క‌డా చిత్ర బృందం దిగుతూ సినిమాను ప్ర‌మోట్ చేసుకుంటూ ఢిల్లీకి చేరుకుంటుంది. ఇందుకోసం రైల్వే వాళ్ల‌కు భారీగానే చెల్లించిన‌ట్లు తెలుస్తోంది. అయ‌తే ఈ ప్ర‌మోష‌న్ ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నం కూడా అదే స్థాయిలో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ త‌ర‌హా ప్ర‌మోష‌న్ ఇండియాలో తొలిసారి. హౌస్ ఫుల్-4 దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా అక్షయ్ కుమార్ కి ఇది ఈ సంవత్సరం మూడో సినిమా  ఈ సినిమా తో తాను రణ్వీర్ సింగ్ పేరు మీద ఉన్నఒకే సంవత్సరంలో అధిక కలెక్షన్స్ వసూలు చేసిన హీరోగా   అరుదుఅయిన రికార్డు ని బ్రేక్ చేయాలి అని చూస్తున్నాడు 



మరింత సమాచారం తెలుసుకోండి: