ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ డైరెక్షన్ లో సూపర్ హిట్ సిరీస్ రాజు గారి గదికి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం రాజు గారి గది3. ఆశ్విన్ బాబు , అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హర్రర్ కామెడీ డ్రామా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫిస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబడుతుంది. అందులో భాగంగా మొదటి రోజు ఈ చిత్రం తెలుగురాష్ట్రాల్లో 1.25కోట్ల షేర్ ను రాబట్టగా రెండో రోజు కూడా అదే జోరు ను కొనసాగించింది. ఫలితంగా రెండో రోజు 1.04కోట్ల షేర్ తో రెండు రోజులకుగాను ఈ చిత్రం ఏపీ & తెలంగాణ లో 2.29 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం మరో 2.5 కోట్లను రాబడితే చాలు బ్రేక్ ఈవెన్ అయినట్లే. ప్రస్తుతం దీపావళికి వరకు వేరే సినిమాలతో పోటీలేకపోవడం ఈ చిత్రానికి కలిసిరానుంది.
ఇక ఈ సినిమా రన్ పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. దాంతో తెలంగాణ లో విజయాత్ర ను నిర్వహించడానికి రాజుగారి గది 3 టీం రెడీ అవుతుంది. ఓంకార్ సొంత ప్రొడక్షన్స్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి చోటా కె నాయుడు ఛాయాగ్రహణం అందించగా సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ ను అందించాడు.