ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్  డైరెక్షన్ లో సూపర్ హిట్ సిరీస్ రాజు గారి గదికి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం రాజు గారి గది3.  ఆశ్విన్ బాబు , అవికా గోర్  ప్రధాన పాత్రల్లో నటించిన ఈ   హర్రర్ కామెడీ  డ్రామా టాక్ తో సంబంధం లేకుండా  బాక్సాఫిస్ వద్ద  డీసెంట్ వసూళ్లను రాబడుతుంది. అందులో భాగంగా  మొదటి రోజు ఈ చిత్రం  తెలుగురాష్ట్రాల్లో 1.25కోట్ల షేర్ ను రాబట్టగా  రెండో రోజు కూడా  అదే జోరు ను కొనసాగించింది. ఫలితంగా  రెండో రోజు 1.04కోట్ల షేర్ తో  రెండు రోజులకుగాను ఈ చిత్రం  ఏపీ & తెలంగాణ లో  2.29 కోట్ల షేర్ ను రాబట్టింది.  ఈ చిత్రం మరో 2.5 కోట్లను రాబడితే చాలు బ్రేక్ ఈవెన్ అయినట్లే. ప్రస్తుతం  దీపావళికి వరకు  వేరే సినిమాలతో పోటీలేకపోవడం  ఈ చిత్రానికి కలిసిరానుంది. 



ఇక ఈ సినిమా  రన్ పట్ల  చిత్ర యూనిట్  ఆనందం వ్యక్తం చేసింది. దాంతో తెలంగాణ లో విజయాత్ర ను  నిర్వహించడానికి  రాజుగారి గది 3 టీం రెడీ అవుతుంది. ఓంకార్ సొంత ప్రొడక్షన్స్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి  చోటా కె నాయుడు ఛాయాగ్రహణం అందించగా   సాయి మాధవ్ బుర్ర  డైలాగ్స్ ను అందించాడు. 



తెలుగు రాష్ట్రాల్లో  ఏరియాల వారీగా ఈ చిత్రం యొక్క  రెండో రోజు వసూళ్ల వివరాలు :
నైజాం : 42 లక్షలు 
సీడెడ్ : 18 లక్షలు 
గుంటూరు :6.3 లక్షలు
కృష్ణా : 7.2 లక్షలు
పశ్చిమ గోదావరి : 5.8 లక్షలు 
తూర్పు గోదావరి : 7.4 లక్షలు 
ఉత్తరాంధ్ర : 14 లక్షలు 
నెల్లూరు : 3.5 లక్షలు 
ఏపీ &తెలంగాణ లో రెండో  రోజు షేర్ మొత్తం =1.04కోట్లు 



మరింత సమాచారం తెలుసుకోండి: