బిగ్ బాస్ 3 సీజన్ ఫైనల్స్ కు చేరుకోవడంతో సింగర్
రాహుల్ సిప్లిగంజ్ టిక్కెట్ టు ఫినాలే దగ్గించుకుని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తుంటే... మరోవైపు మిగిలిన కంటెస్టెంట్లు ఫైనల్కు చేరుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఈ కంటెస్టెంట్ లు పాల్గొంటున్న టాస్క్లకు సంచాలకులుగా ఉంటున్న
రాహుల్ మాత్రం చాలా కూల్ గా ఉన్నాడు. షో ఫైనల్ స్టేజ్కు చేరుకోవడంతో
బిగ్ బాస్ చాలా కఠినమైన టాస్కులతో కంటెస్టెంట్లకు పరీక్ష పెడుతున్నాడు. లేడీ కంటెస్టెంట్లు అయిన శ్రీముఖిని చేప నోట్లో ఉన్న ఇన్స్ట్ర్మెంట్స్ ప్లే చేయాలని...
శివ జ్యోతితో గుడ్డు కలిపిన పాలు తాగాలని ఆదేశించాడు.
ఇక పురుష కంటెస్టెంట్లు అయిన వరుణ్, ఆలీబాబా,
బాబా భాస్కర్కు సైతం కొంచెం కష్టమైన టాస్క్ ఇచ్చాడు. హౌస్ లో ఉన్న ఆరుగురు సభ్యులలో ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. ఒకరు ఎలిమినేట్ అవుతారు. వీరిలో
రాహుల్ ఇప్పటికే ఫైనల్కు చేరుకోవడంతో మిగిలిన ఐదుగురిలో ఎవరు హౌస్లో ఉంటారు ? బయటకు వెళ్లే ఆ ఒక్కరు ఎవరు ? అన్నది ఉత్కంఠగా మారింది.
ఇప్పుడు ఉన్న ఐదుగురిలో
శివజ్యోతి మిగిలిన సభ్యులకంటే తక్కువ ఓట్లు సంపాదించి ఎలిమినేషన్ కి దగ్గరైందని సమాచారం. మిగిలిన నలుగురితో పోల్చుకుంటే
శివ జ్యోతి వీక్ కంటెస్టెంట్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే హౌస్ నుంచి ఒకసారి బయటకు వెళ్లి వచ్చిన
అలీ రెజాకు సైతం తక్కువ ఓట్లు వచ్చినా టాస్క్లలో
అలీ పెర్పామెన్స్ బాగుండడంతో
శివజ్యోతి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చి సేఫ్ అవుతాడన తెలుస్తోంది. బయట సోషల్
మీడియా ట్రెండింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. మరి ఈ అంచనాలు ఎలా ఉన్నా ఫైనల్గా ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు ? ఎవరు ఫైనల్కు వెళతారు ? అన్నది ఆదివారం తేలిపోనుంది.