కాజల్ అగర్వాల్.. డైరెక్టర్
తేజ 'లక్ష్మీ కళ్యాణం'తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయంది...క్రియేటివ్ దర్శకుడు
కృష్ణ వంశీ 'చందమామ' సినిమాతో అందరిని బాగా మెప్పించింది. ఇక అప్పటినుండి.. ఇప్పటివరకు వెనుకకు చూసింది లేదు ఈ భామ. దాదాపు ఓ దశాబ్దం కాలంగా తెలుగువారిని తన అందచందాలతో బాగా అందరిని అలకరిస్తూ వస్తుంది.
తెలుగు ఇండస్ట్రీలో దాదాపు అందరీ హీరోల సరసన నటిచడం జరిగింది. అంతే కాకుండా స్టార్ హీరోయిన్గా కూడా గుర్తింపు పొంది ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ
తమిళ్,
హిందీ సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే కేరిర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాలతో అభిమానుల్ని సంపాదించుకుంది కాజల్. ప్రస్తుతం కాజల్కు
సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. దీంతో కొత్తగా కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది.
ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం కొత్త
టెక్నాలజీ అందుబాటులోకి రావడం.. దీనికి తోడు ఇంటర్నెట్ సేవలు కూడా అందరికి అనుకూల ధరల్లో ఉండడంతో ఇండియాలో డిజిటల్
మీడియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు
ఇండియా బాట పడుతున్నాయి. అందులో భాగంగా ఇండియాలో ప్రస్తుతం.. నెట్ఫ్లిక్స్,
అమెజాన్ ప్రైమ్లు చాలా ప్రాచుర్యం పొందడం జరిగింది. అంతేకాదు.. ఈ సంస్థలు సొంతంగా కాంటెంట్ను ప్రొడ్యూస్ కూడా చేయడం జరుగుతుంది. వాటినే మనం ఒరిజనల్స్గా పిలుస్తున్నాము.
ఈ ఒరిజనల్స్లో హిందీలో కియారా నుండి రాధికా ఆప్టే వరకు వెబ్ సిరీస్లు చేస్తూ అటూ డిజిటల్లో ఇటూ సినిమాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. తెలుగులో కూడా ఇలాంటీ కల్చర్ ఇప్పుడిప్పుడే వస్తోంది. ఆ మధ్య జగ్గుబాయ్ ఓ వెబ్ సీరిస్లో అదరగొట్టిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా హీరోయిన్
కాజల్ అగర్వాల్ కూడా వెబ్సిరీస్లో నటించేందుకు ఆసక్తి చూపినట్టు అథిష్ఠాలు వస్తున్నాయి.
తమిళ దర్శకుడు
వెంకట్ ప్రభు రుపొందిస్తున్న ఓ వెబ్సిరీస్లో అందాల
కాజల్ నటించేందుకు ఒప్పుకుందని సమాచారం. కాగా మొదట తమిళంలో తెరకెక్కనున్న ఈ వెబ్సిరీస్ ఆ తర్వాత తెలుగులోకి కూడా విడుదల కానుంది.
కాగా మరో తెలుగు టాప్ హీరోయిన్ సమంత కూడా
అమెజాన్ ప్రైమ్ వెబ్సిరీస్.. ఫ్యామిలీ మ్యాన్లో నటించబోతోందంటు తెలుస్తోంది. అయితే సినిమాలతో పోల్చితే.. డిజిటల్లో కంటెంట్ను అనుకున్న విధంగా.. చెప్పడమే కాకుండా.. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ.. దీంతో హీరోయిన్స్ మాత్రమే కాకుండా.. ఇటు డైరెక్టర్స్ కూడా డిజిటల్ బాట పడుతున్నారు. అందులో భాగంగానే
తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి.. మొదలగు వాళ్లు డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు