దీపావళి పండుగ సందర్బంగా సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా సంబరాలు జరుపు కోవడం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ జంటగా ప్రతిరోజూ పండగే సినిమా చేస్తున్నారు . ఈ సందర్భంగా దీపావళి  పండగను కూడా జరుపుకున్నారు. చిత్రలహరి చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్న సుప్రీం హీరో సాయి తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. 


నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, వంద కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవిందం వంటి సూపర్ డూపర్ హిట్స్ తన సొంతం చేసుకున్న  నిర్మించిన బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్‌ పాత్ర పోసిసితున్నారు. ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ అమెరికాలో తీస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.


సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ ఆఫ్ ప్రతిరోజూ పండగే కు మంచి ఆదరణ లభించడం జరుగుతుంది  ఈ వీడియోలో సాయి ధరమ్ తేజ్, సత్యరాజ్ మధ్య వచ్చే సన్నివేషాలు చాల బాగా ఉన్నాయి. ఈ సినిమాలో తాత & మనవడు మధ్య రిలేషన్ ను  బాగా చూపించడం జరుగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్ ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్‌గా రాబోతుంది ఈ సినిమా. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్ టైన్ మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగా వస్తుంది అని తెలుపుతున్నారు చిత్ర యూనిట్.


GA2UV పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు. సాయితేజ్, మారుతి కాంబినేష‌న్ లో తెర‌కెక్కనున్న ప్రతిరోజూ పండుగే చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సుప్రీమ్ హీరో సాయి తేజ్, ఢిల్లీ బ్యూటీ రాశీ ఖ‌న్నా సుప్రీమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత మరోసారి కలిసి నటిస్తున్నారు. క‌ట్టప్పగా తెలుగు ప్రేక్షకుల‌కి మరింత చేరువైన ప్రముఖ న‌టులు స‌త్య‌రాజ్ క్యారెక్టర్ ని ఈ సినిమా ద‌ర్శకుడు మారుతి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అలానే ఈ సినిమాలో న‌టిస్తున్న మ‌రో న‌టుడు రావు ర‌మేశ్ పాత్ర కూడా హైలెట్‌గా ఉండబోతోంది. డిసెంబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: