రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద సినిమాలను తీయడమే కాకుండా ఆ సినిమాలకు హైక్ క్రియేట్ చేసి మార్కెట్ సృష్టించుకోవడంలో సిద్ధహస్తుడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీలో కొత్త విషయాలు ఏమి లేకపోయినా ఆ సినిమాకు హైక్ తీసుకు వచ్చి వివాదాలు సృష్టించడంతో ఏకంగా ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశ వర్గాలే భయపడిపోయాయి. 

ఇప్పుడు మళ్ళీ వర్మ అదే తరహా ప్రయోగాన్ని చేస్తున్నాడు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ వర్మ లేటెస్ట్ గా తీస్తున్న మూవీలో పవన్ కళ్యాణ్ ను పోలివున్న ఒక వ్యక్తిని ఎంచుకుని పవన్ ఇమేజ్ ని దెబ్బ తీసే విధంగా కొన్ని స్టిల్స్ ను విడుదల చేస్తున్నాడు. దీనితో ఈ మూవీలో పవన్ ను విపరీతంగా వర్మ టార్గెట్ చేయబోతున్నాడు అన్న సంకేతాలు వస్తున్నాయి. 

అయితే పవన్ పై ఎవరైనా సెటైర్ వేస్తే విపరీతంగా రెచ్చిపోయే పవన్ వీరాభిమానులు ఈసారి వర్మ చేస్తున్న ప్రయోగాన్ని పట్టించుకోకపోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. దీనితో పవన్ అభిమానులు తమ స్ట్రాటజీ మార్చారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

వర్మ ఎంత రెచ్చకొట్టినా పవన్ అభిమానులు పట్టించుకోక పోవడంతో తన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీకి ఎలా హైక్ తీసుకు రావాలో తెలియక వర్మ మధన పడిపోతున్నట్లు టాక్. దీనికితోడు రెండు ప్రధాన కులాల మధ్య వర్మ పెట్టబోతున్న చిచ్చుకు సంబంధించిన విషయాలను ముందుగానే గ్రహించిన చాలమంది ప్రస్తుతం వర్మను అతడు చేస్తున్న ప్రయోగం పై తిట్టి పోస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఇసుక సంక్షోభానికి వ్యతిరేకంగా ఆందోళనకు శ్రీకారం చుట్టిన సమయంలో వర్మ పవన్ ను టార్గెట్ చేస్తూ పోస్టర్స్ ను పవన్ అభిమానులు పట్టించుకొకపోవడం వెనుక పవన్ సన్నిహితుల సలహాలు ఉన్నాయా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: