కన్నడ చిత్రం కిరాక్ పార్టీ తో చాలా ఫేమస్ అయింది
రష్మిక మందన. తెలుగులోకి నాగశౌర్య సరసన 'చలో' సినిమాతో ప్రవేశించింది. ఆ తర్వాత వచ్చిన
గీత గోవిందం చిన్న సినిమాలలో
ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఆక్కడ నుంచి ఆమెని వెనక్కి తిరిగి చూడడం లేదు నానితో దేవదాసు,
మహేష్ బాబు గారితో సరిలేరు నీకెవ్వరు. అలాగే తమిళంలో
విజయ్ కూడా జత కట్టింది.ఇప్పుడు ఈమె
నితిన్ తో నటిస్తున్న భీష్మ
సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.
నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్
వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశచెందుతున్నారు. అయితే
దీపావళి కానుకగా అభిమానులకు నితిన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ‘భీష్మ’కు సంబంధించిన పోస్టర్లను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.
మాస్, క్లాస్, లవ్, రొమాన్స్ షేడ్స్ కనిపించేలా విడుదల చేసిన పోస్టర్లు నెటిజన్లను తీవ్రంగా ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్
రష్మిక మరోసారి కుర్రకారును పిచ్చెక్కించడం ఖాయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.నితిన్ కూడా చాల రోజుల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. చివరగా ఆ ఆ తో విజయం చూసాడు.ఈ సారీ అయినా
రష్మిక మందన్న అదృష్టం తేసుతుందో లేదో .
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై
సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉంది. ‘భీష్మ’ షూటింగ్ జరుగుతుండగానే 'తొలిప్రేమ' ఫేమ్
వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే'
సినిమా షూటింగ్ విజయదశమి రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో
కీర్తి సురేష్ నితిన్ సరసన ఆడిపాడనుంది.ఇక కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరున్న చంద్రశేఖర్ ఏలేటితో కూడా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు నితిన్.