డైలాగ్  కింగ్ మోహన్ బాబు  రెండవ  కుమారుడు అయినా మంచు మనోజ్ .సినీ ఇండస్ట్రీ కి హీరో గా  పరిచయం అయిన  తొలినాళ్ళలో చాలా మంచి సినిమాలు తీశాడు ఆ తర్వాత కానీ కొన్ని రోజులకి అతనికి విజయం వరించలేదు ఏది ఏమైనా అతని లోని నటుడు ఇప్పుడు మరో రూపం దాల్చే లాగా చేసుకుంటున్నాడు దీపావళి సందర్భంగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

దీపావళి పండగ రోజున తన సినీ జీవితాన్ని సరికొత్తగా పునః ప్రారంభిస్తున్నాంటూ ట్వీట్ పెట్టారు. కొంతకాలంగా మంచు మనోజ్ కుటుంబపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవలే తన భార్యకు విడాకులు కూడా ఇచ్చానని తెలిపాడు.

రెండేళ్ల తమ అందమైన బంధానికి ముగింపు పలికామని.. తమ భార్య భర్త ల మధ్య కొన్నిఅనుకోని  భేదాభిప్రాయాలు వచ్చాయని  వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం  విఫలం అయింది తన అభిమానులతో పంచుకున్నాడు. వాటి వల్ల చాలా బాధ కూడా అనుభవించామని తెలియజేసాడు మనోజ్.  ఇద్దరం విడిపోవడానికి నిశ్చయించుకొనే విడాకులు తీసుకున్నామన్నాడు. దీనిపై తన  మనసు లో మాట ను అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఒక లెటర్ కూడా పోస్టు చేశాడు.


భార్యకు విడాకులు తర్వాత కాస్త రిలీఫ్ గా ఫీలైన మనోజ్ ఇకపై తన ఆనందాన్నితిరిగి  సినిమా రంగంలోనే వెతుక్కుంటానని అభిమానులకు తెలిపాడు. అయితే ఈసారి నిర్మాతగా మారుతున్నట్లు మంచు మనోజ్ ఆసక్తి చూపించాడు. దీపావళి సందర్భంగా తన పేరు కలిసొచ్చేలా ఎంఎం ఆర్ట్స్ బ్యానర్ స్థాపించాడు. బ్యానర్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. తన సొంత బ్యానర్ ద్వారా కొత్త ప్రతిభను పరిచయం చేస్తానని తెలిపాడు. రానున్న రోజుల్లో మంచి సినిమాలు తన బ్యానర్ నుంచి  ఎన్నో వస్తాయన్నాడు మంచు మనోజ్.


మరింత సమాచారం తెలుసుకోండి: