నిన్న సాయంత్రం చిరంజీవి తాను కొత్తగా రీ మోడల్ చేసుకున్న ఇంటిలో మెగా కుటుంబ సభ్యులందరికీ దీపావళి డిన్నర్ హోస్ట్ చేసాడు. ఈ పండగ పార్టీకి మెగా కుటుంబ సభ్యులందరూ రావడమే కాకుండా చాల హుషారుగా బాణసంచా కాలుస్తూ సందడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

దీపావళి సంబంరాలకు పవన్ తన భార్య అన్న మరియు నలుగురి పిల్లలతో రావడమే కాకుండా పవన్ చాల హుషారుగా చిరంజీవి ఇంట్లో సందడి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిన్నటి మెగా స్టార్ ఇంట్లో జరిగిన దీపావళి సంబరాలకు పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ప్రధాన ఆకర్షణగా మారినట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా చిరంజీవి కూడ పవన్ చిన్న కొడుకును చూసి తెగ మురిసి పోయినట్లు టాక్. నాగబాబు వరుణ్ తేజ్ నిహారిక సాయి ధరమ్ తేజ్ లతో పాటు మెగా కుటుంబ సభ్యులు అంతా ఈ దీపావళి సంబరాలకు వచ్చారు. ముఖ్యంగా పవన్ పెద్ద కొడుకు అకిరా నందన్ బ్లాక్ కలర్ డ్రెస్ తో వచ్చి మెగా డిన్నర్ పార్టీలో ఒక మెరుపు మెరిసి నట్లు టాక్. 

ఇప్పటికే రామ్ చరణ్ నిన్న ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో తాను అకిరాను తన సొంత ప్రొడక్షన్ హౌస్ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను అని చెప్పిన నేపధ్యంలో ఇప్పుడు ఇలా పవన్ చిరంజీవిలు దీపావళి రోజున కలవడం మెగా అభిమానులకు మంచి జోష్ ను ఇస్తోంది. ‘సైరా’ మూవీ బయ్యర్లు చాలామంది నష్టపోయారు అని వార్తలు వస్తుంటే నిన్న చరణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘సైరా’ 275 కోట్ల నెట్ కలక్షన్స్ వచ్చాయి అని చెప్పడంతో ప్రస్తుతం ఈ మూవీ బయ్యర్లు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్య పోతున్నట్లు సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: