రెండు నెలల సమయమున్నా సంక్రాంతి పోటీకి ఇప్పటి నుంచే రెండు సినిమాలు కాలు దువ్వుతున్నాయి. ఒకటి అల.. వైకుంఠపురంలో, రెండు సరిలేరు నీకెవ్వరు. ప్రమోషన్ల విషయంలో అల.. వైకుంఠపురం టీమ్ ముందుంటే అప్పుడే తొందరెందుకన్నట్టు సరిలేరు నీకెవ్వరు టీమ్ ఉంది. కానీ.. పాటలు విడుదల చేయాలని మహేశ్ పై అభిమానుల ఒత్తిడి ఎక్కువవుతోందని సమాచారం.

 


పెద్ద హీరో సినిమా అంటే అభిమానులు ఎదురుచూస్తూంటారు. ఫస్ట్ లుక్ దగ్గర నుంచీ ట్రైలర్, సినిమా వరకూ వారిలో ఆసక్తి నెలంకొంటుంది. మెగా, బన్నీ, మహేశ్ అభిమానులు ఇదే తరహాలో ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో కాస్త ముందునుంచే ఆలోచించిన బన్నీ రెండు పాటలను తమన్, సింగర్ తో కలిపి విసువలైజ్ చేసి సామజవరగమన.. పాట వదిలాడు. ఈ పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దీంతోనే అల.. కు విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. సరిలేరు.. తేరుకునేలోపే రాములో.. రాములా పాట రిలీజ్ చేశాడు. ఈ పాట సామజవరగమనను.. దాటేసి మరో అద్భుతం చేస్తోంది. దీంతో ప్రమోషన్ విషయంలో సరిలేరు.. వెనుకబడిపోయిందనే టాక్ వైరల్ అయిపోంది. దీనికోసం సరిలేరు టీమ్ నుంచి చిన్న క్లిప్ వచ్చింది.. అప్పుడే ఏంటి తొందర మన సినిమా సంక్రాంతి.. ఇది దీపావళి మాత్రమే అనే బిట్ దర్శకుడు అనిల్ తో వదిలారు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ పీక్స్ కి వెళ్లిపోయింది.

 


కానీ.. మహేశ్ అభిమానులు ఊరుకుంటారా! మహేశ్, ప్రోడ్యూసర్, దర్శకుడిపై ఒత్తిడి తెస్తున్నారట. పాటలు రిలీజ్ చేయాలి.. సినిమా జనాల్లోకి వెళ్లాలి అంటూ! మహేశ్ లుక్స్ పై నెట్లో బజ్ క్రియేట్ కాకపోగా నెగటివ్ ట్రోలింగ్ ఎక్కువగా జరిగింది. దీంతో అభిమానులు పాటలతో అయినా సినిమాపై బజ్ క్రియేట్ చేయాలని సినిమా టీమ్ ను కోరుతున్నారట.

 


మరింత సమాచారం తెలుసుకోండి: