తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్  వరుసగా మూడో సారి 200కోట్ల  క్లబ్ లో చేరి  రికార్డు సృష్టించాడు.  2017 లో  మెర్సల్ తో  ఈఫీట్ సాధించిన విజయ్  2018లో సర్కార్ తో  మరో సారి ఈ  ఘనత సాదించాడు. ఇక ఇప్పుడు  బిగిల్ తో  మూడో సారి 200క్లబ్ లో చేరి హ్యాట్రిక్ నమోదుచేశాడు.  ఇటీవల విడుదలైన ఈ చిత్రం కేవలం 5రోజుల్లోనే  ప్రపంచ వ్యాప్తంగా  200కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషం.



మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రాబట్టుకోవడంతో  బిగిల్  బాక్సాఫీస్ వద్ద  సత్తా చాటుతుంది. ఫుల్ రన్ లో ఈచిత్రం  250 కోట్ల వరకు  రాబట్టేలాగే  కనిపిస్తుంది.యూఎస్ఏ లో కూడా ఈ చిత్రం  1మిలియన్  క్లబ్ లో చేరింది.  ఇక బిగిల్ తెలుగు వెర్షన్  విజిల్ కూడా తెలుగు రాష్ట్రాల్లో అదరగొడుతుంది. ఇప్పటివరకు ఈ చిత్రం 8.5కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం. మరో కోటి  యాబై లక్షల షేర్ తెస్తే  బ్రేక్ ఈవెన్ అయ్యనట్లే.  దాంతో ఈ వారం లో ఆ మార్క్ ను క్రాస్ చేయనుంది. 




స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో  అట్లీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో   లేడీ సూపర్ స్టార్   నయనతార కథానాయికగా  నటించగా  ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.  భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని  ఏజిఎస్ ఎంటర్ టైన్మెంట్స్  పతాకం పై కల్పాతి ఎస్ అగోరం  నిర్మించాడు.  ఇక అట్లీ - విజయ్ లకు బిగిల్ హ్యాట్రిక్ విజయాన్ని అందించింది.  ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన  తెరి , మెర్సల్  సూపర్ హిట్లు అవ్వగా తాజాగా బిగిల్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: