పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ హీరోగా గత ఏడాది వచ్చిన అజ్ఞాతవాసి
సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.
పవన్ కెరీర్ లో అతి ఫ్లాప్ గా నిలిచిన ఆ
సినిమా అనంతరం ఆయన రాజకీయాల్లో పూర్తిగా బిజీ అవడం జరిగింది. ఇక ఇటీవల తన
జనసేన పార్టీ తరపున
ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్ష ఎన్నికల బరిలో
పవన్ నిలవడం జరిగింది. అయితే అనూహ్యంగా పోటీ చేసిన రెండు స్థానాల్లో
పవన్ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. దానితో ఇకపై తమ పార్టీని మరింతగా ప్రజలకు చేరువ చేయాలనే తలంపుతో
పవన్, విరివిగా పలు సమావేశాలు నిర్వహిస్తూ,
అతి త్వరలో ప్రజల వద్దకు యాత్రల ద్వారా వెళ్లనున్నారు. ఇక ఈ విషయాలు అటుంచితే, అజ్ఞాతవాసి తరువాత
పవన్ గారు తమ కోసం ఒక మంచి
మూవీ చేస్తే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ ఎప్పటినుండో కోరుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక గత కొద్దిరోజులుగా
పవన్ సినిమా చేస్తున్నారంటూ వార్తలు కూడా విపరీతంగా వైరల్ ఆవుతూ వచ్చాయి. ఇక గత మూడురోజుల నుండి
పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో ఒక
సినిమా చేయనున్నారు అనే వార్తలు మరింతగా వ్యాప్తి చెందడంతో ఫ్యాన్స్ అందరూ ఆ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూసారు. అయితే ఫైనల్ గా అనుకున్న విధంగా
పవన్ గారు, క్రిష్ దర్శకత్వంలో ఒక
సినిమా చేయడానికి సిద్ధం అయ్యారట.
ఇక కాసేపటి క్రితం ఈ న్యూస్ ఆయన సన్నిహితుల నుండి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే
సినిమా ఎటువంటి జానర్లో ఉంటుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను గతంలో
పవన్ తో
ఖుషి, బంగారం సినిమాలు నిర్మించిన ఏఎమ్ రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారని, అలానే సినిమాను అఫీషియల్ గా
నవంబర్ 15న పూజా కార్యక్రమంతో లాంఛ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక దీనిపై నేడో, రేపో ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం కనపడుతోందట. మరి ఈ వార్త కనుక నిజమే అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇంతకంటే
పండుగ న్యూస్ మరొకటి ఉండదని చెప్పాలి.....!!