బొద్దుగుమ్మ.. రింగుల జుట్టు పోరి అంటే వేంటనే గుర్తొచ్చే పేరు
నిత్యా మీనన్.. నటన అంటే జీవితం అనుకునే అతి కొద్దీ మంది హీరోయిన్లలో
నిత్యా ఒకరు. అందంలో ఏ మాత్రం తీసిపోదు.. అలాంటి నిత్యాకు ఆఫర్లకు కొదవలేదని చెప్పాలి. చేతి నిండా ఉన్నాయి కానీ ఎందుకో ఈ అమ్మడు వరుస సినిమాలలో నటించలేదు. కొంచం హైట్ తక్కువ కాబట్టి సరిపోయింది లేకుంటే
సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఈమె పాదాల దగ్గరుండేది.
కాగా, ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు.
తమిళ్ తో పాటుగా తెలుగులోనూ
నిత్యా మీనన్ను ఇష్టపడే వాళ్లు చాలా ఎక్కువే. ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ
బ్యూటీ ఆ తరవాత అన్నీ మంచి మంచి పాత్రలే చేశారు. గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకున్నారు.తెలుగులో ఈ అమ్మడు ఈమధ్య చేసిన సినిమాలంటే.. గీతగోవిందం మరియు
ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు.
వివరాల్లోకి వెళితే..
నిత్యా ఇప్పుడు అమ్మ
జయలలిత బయోపిక్ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సందర్భంలో ఓ ప్రముఖ పత్రిక ఈ
సినిమా గురించి మాట్లాడుతూ.. ‘శ్రీమతి
నిత్యా మీనన్’ అని రాశారు. దీంతో రచ్చ మొదలైంది. సాధారణంగా పెళ్లైన మహిళలనే శ్రీమతి అంటారు. పెళ్లికాని వాళ్ళు కుమారి అని సంబోధిస్తారు.ఆ చిన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమాలలో నటించిన శ్రీయ. రాధికా ఆప్టే, ఇలియానాలు సీక్రెట్ పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇకపోతే
నిత్యా కూడా అలానే చేసుకుందా అనే వార్తలు రావడంపై చాలా మంది సహించలేకపోయారు. కాగా, గతంలో
టెలివిజన్ ప్రొడ్యూసర్,
డైరెక్టర్ అయిన ఆలివర్ మాక్ కల్హౌన్తో దిగిన ఫొటోలను ఇప్పటికే
నిత్యా మీనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందరిలా ఈమె కూడా ఎం షాక్ ఇస్తుందో చూడాలి..