'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్షన్ లో ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్న చిత్రం 'విరాటపర్వం' 1992. గత నెల నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో
రానా మరో లీడ్ రోల్ లో నటించనున్నాడు. అయితే అనారోగ్య కారణాలవల్ల ఇప్పటివరకు ఈసినిమా షూటింగ్ లో అతను జాయిన్ కాలేకపోయాడు. ప్రస్తుతం రానా పూర్తిగా కోలుకోవడం తో త్వరలోనే సెట్ లో అడుగు పెట్టనున్నాడు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల
వరంగల్ , పరకాల , కాళేశ్వరం లో సాయి పల్లవి పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈచిత్రంలో సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనుంది. ఆ పాత్ర రియాలిస్టిక్ గా ఉండడం కోసం ఆమె త్వరలోనే ఓ మాజీ నక్సలైట్ దగ్గర శిక్షణ కూడా తీసుకోనుందని సమాచారం. నక్సలైట్ల బాడీ లాంగ్వేజ్ , గన్ ఫైరింగ్ , బాంబులు ఎలా విసరాలి అనే విషయాల్లో సాయి పల్లవి శిక్షణ తీసుకోనుందట.
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్
లవ్ స్టోరీ మరియు పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళ నటి నందిత దాస్ మానవ హక్కుల నేతగానటిస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ల పై సురేష్ బాబు , చెరుకూరి
సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. ఇక సాయి పల్లవి ఈచిత్రం తోపాటు ప్రస్తుతం యువ సామ్రాట్
నాగ చైతన్య తో కలిసి
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటిస్తుంది. లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది సమ్మర్ లోనే విడుదలకానుంది. కాగా సాయి పల్లవి కి
శేఖర్ కమ్ముల తో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా సూపర్ హిట్ అయ్యింది.