నవంబర్ చివరి వారం లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. షాహిద్ కపూర్ హీరో గా ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ రీమేక్ ను తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు.. అమన్ గిల్ తో కలిసి నిర్మించనున్నారు. కాగా అల్లు అరవింద్ ఇంతకుముందు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో గజినీ రీమేక్ ను నిర్మించగా .. దిల్ రాజు కు మాత్రం అక్కడ ఇదే మొదటి సినిమా. ఈ చిత్రాన్ని ఆగస్టు 28 , 2020కి ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.ఇక షాహిద్ కపూర్ ఇటీవల కబీర్ సింగ్ తో ప్రేక్షకులముందుకు వచ్చి భారీ హిట్ కొట్టాడు. బ్లాక్ బాస్టర్ తెలుగు మూవీ అర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేశాడు. ఒరిజినల్ వెర్షన్ ను కూడా ఆయనే తెరకెక్కించిన విషయం తెలిసిందే. జూలై లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ 270కోట్ల వసూళ్లను రాబట్టి ఈఏడాది హిందీ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రంగా రికార్డు సృష్టించింది. దాంతో షాహిద్ కపూర్ మరో తెలుగు రీమేక్ లో నటించడానికి రెడీ అయ్యాడు.