ప్రస్తుతం  మలయాళం లో తప్ప సౌత్ లో మిగితా  అన్ని భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా వుంది కన్నడ బ్యూటీ  రష్మిక మందన్న.  అందులో భాగంగా ఆమె  తెలుగులో సరిలేరు నీకెవ్వరు , భీష్మ , కన్నడంలో పొగరు , తమిళంలో సుల్తాన్  చిత్రాల్లో   నటిస్తుంది. ఇక ఇటీవల రష్మిక  బాలీవుడ్ లో జెర్సీ  రీమేక్ లో  కూడా నటించనుందని వార్తలు  వచ్చాయి. అయితే  డేట్స్  అడ్జెస్ట్  కాకపోవడంతో  ఈసినిమా నుండి రష్మిక తప్పుకుందట. దాంతో మేకర్స్  ఆమె స్థానంలో సూపర్ 30 , బాట్ల  హౌస్ ఫేమ్  మృణాల్ ఠాకూర్  ను ఎంపికచేశారు. 



నవంబర్  చివరి వారం లో ఈ చిత్రం  సెట్స్ మీదకు వెళ్లనుంది.  షాహిద్ కపూర్ హీరో గా ఒరిజినల్  వెర్షన్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ రీమేక్ ను తెరకెక్కించనున్నాడు.  ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు  అల్లు అరవింద్, దిల్ రాజు..  అమన్ గిల్ తో కలిసి నిర్మించనున్నారు.  కాగా అల్లు అరవింద్ ఇంతకుముందు బాలీవుడ్ లో  అమీర్ ఖాన్ తో గజినీ  రీమేక్  ను నిర్మించగా .. దిల్ రాజు కు మాత్రం  అక్కడ ఇదే మొదటి సినిమా.  ఈ చిత్రాన్ని ఆగస్టు 28 , 2020కి ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.ఇక షాహిద్ కపూర్  ఇటీవల  కబీర్ సింగ్ తో  ప్రేక్షకులముందుకు వచ్చి భారీ హిట్ కొట్టాడు.  బ్లాక్ బాస్టర్ తెలుగు మూవీ అర్జున్ రెడ్డి  రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ  డైరెక్ట్ చేశాడు.  ఒరిజినల్ వెర్షన్ ను కూడా ఆయనే తెరకెక్కించిన  విషయం తెలిసిందే.  జూలై లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ  270కోట్ల వసూళ్లను రాబట్టి  ఈఏడాది హిందీ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రంగా  రికార్డు సృష్టించింది.  దాంతో  షాహిద్  కపూర్  మరో తెలుగు  రీమేక్ లో  నటించడానికి రెడీ అయ్యాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: