ఇటీవల ఢిల్లీలో
ప్రధాని నరేంద్ర మోడి తన నివాసంలో సినీ తారలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని మోడి ఇంట జరిగిన ఆ కార్యక్రమంలో దక్షిణాది నుంచి పెద్దగా ప్రాతినిధ్యం కనిపించలేదు. దాంతో విమర్శలు వెల్లువెత్తాయి. సినీ రంగం అంటే
బాలీవుడ్ ఒక్కటే కాదని, భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దక్షిణాది చిత్ర పరిశ్రమలు కూడా దోహదం చేస్తున్నాయని పలువురు కేంద్రం వైఖరిని ప్రశ్నించారు.
మెగా కోడలు, అపోలో ఫౌండేషన్ అధినేత
ఉపాసన కూడా మోదీని విమర్శించారు.మేము కూడా ప్రధానిగా మీ పనితీరు చూసి గర్వపడుతున్నాం. కానీ సినీ ప్రముఖుల సమావేశంలో సౌత్ స్టార్స్కు చోటు కల్పించకపోవటం బాధాకరం అంటూ
మోదీ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది ఉపాసన. ఈ నేపథ్యంలో
చిరంజీవి, రామ్చరణ్లకు
ప్రధాని ఆహ్వానం అంటూ వార్తలు రావటం ప్రధాన్యం సంతరించుకుంది. మరి నిజంగానే చిరు, చరణ్లకు
మోదీ ఆహ్వానం అందిందా..? లేక ఇవన్నీ వట్టి రూమర్సేనా..? అసలు విషయం తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఐతే, గతంలో
ఢిల్లీ వెళ్లిన చిరు పలు జాతీయ నేతలను
సైరా సినిమాను చూడాలనికోరారు. వెంటనే స్పందించిన
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్తో కలిసి
సైరా సినిమా చూసి ఆయన్ను అభినందించారు. అదే సమయంలో మోదీని కూడా ఈ షోకు చిరు ఆహ్వానించినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఆ సమయంలో
మహారాష్ట్ర,
హర్యానా ఎన్నికల ప్రచార హడావిడిలో ఉన్న
మోదీ సైరా సినిమాను చూడలేకపోయారు.
అందుకే చిరును ప్రత్యేకంగా ఆహ్వానించినట్టుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ తండ్రీతనయులు
ఢిల్లీ వెళుతున్నారు. త్వరలోనే తండ్రితో కలిసి
ఢిల్లీ వెళుతున్నానని
రామ్ చరణ్ ఓ జాతీయ
మీడియా సంస్థకు తెలిపినట్టు సమాచారం. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల హడావుడి ఇంకా కొనసాగుతుండడంతో ఆ సందడి తగ్గిన తర్వాత వెళ్లాలనుకుంటున్నామని
చరణ్ చెప్పినట్టు తెలుస్తోంది.