1970 ప్రాంతాలలో వచ్చిన ‘బలిపీఠం’ మూవీ కథ ముప్పాళ్ళ రంగనాయకమ్మ ‘బలిపీఠం’ నవల ఆధారంగా నిర్మింపబడింది. కులాంతర వివాహం చేసుకున్న ఇద్దరు భార్య భర్తలు ఆ తరువాత వారివారి కులాలకు సంబంధించిన ఆచార వ్యవహారాలకు ఏర్పడ్డ భేదాభిప్రాయాలు ఇగో సమస్యలుగా మారి విడిపోయిన కథ చట్టూ ఆ మూవీ కథ నడుస్తుంది.

ఇప్పుడు ఇంచుమించు అదే కథను ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి శేఖర్ కమ్ముల నాగచైతన్య సాయి పల్లవిలతో తీస్తున్న మూవీ కథ అన్న ప్రచారం జరుగుతోంది. ఈ మూవీకి ‘లవ్ స్టోరీ’ అన్న టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేసాడు. 

తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడి పాత్రలో నాగచైతన్య నటిస్తూ ఉంటే ఆంధ్రా ప్రాంతానికి చెందిన అమ్మాయిగా సాయి పల్లవి నటిస్తూ ఈ మూవీలో క్లాసికల్ డాన్సర్ గా కనిపించబోతోంది. అయితే వీరిద్దరు ప్రేమించి పెళ్ళి చేసుకున్నప్పటికీ తెలంగాణ ఆంధ్రా ప్రాంతాల మధ్య మధ్య ఉండే చిన్నచిన్న తేడాలు ముఖ్యంగా సాంప్రదాయాలు ఆహారపు అలవాట్లలో ఉన్న తేడాలు వల్ల వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడి ఆ తరువాత ఆ అభిప్రాయభేదాలు ఇగో సమస్యగా మారిన సున్నిత విషయాన్ని చూపెడుతూ శేఖర్ కమ్ముల మరొకసారి కొత్త ప్రయోగం చేస్తున్నాడు అని టాక్.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాల వేగంగా జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ ను డిసెంబర్ నెలాఖరుకి పూర్తి చేసి జనవరిలో ఫస్ట్ కాపీని రెడీ చేసి ఫిబ్రవరి 14న వచ్చే వాలెంటైన్స్ డే రోజున విడుదల చేయబోతున్నారు. ఇగో సమస్యల వల్ల ప్రేమించి పెళ్ళి చేసుకుని కూడ విడిపోతున్న అనేక జంటలకు కనువిప్పుగా ఒక చిన్న సందేశం ఉంటుంది అని తెలుస్తోంది. ‘ఫిదా’ తరువాత శేఖర్ కమ్ముల నుండి రాబోతున్న మూవీ కావడంతో ఈ మూవీకి భారీ స్థాయిలో బిజినెస్ అవుతున్నట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: