పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ అభిమానులకు  గుడ్ న్యూస్.  గత ఏడాది అజ్ఞాతవాసి తరువాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి  వెళ్ళి సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్  మళ్ళీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.   గత కొద్దీ రోజులుగా  ఈ రీ ఎంట్రీ వార్తలు సామజిక మాధ్యమాల్లో  వైరల్ అయినా  అధికారికంగా  ఎలాంటి  ప్రకటన రాకపోయేసరికి  అభిమానులు అయోమయం లో పడ్డారు. అయితే తాజాగా  ప్రముఖ  బాలీవుడ్  నిర్మాత  బోనీ కపూర్  పవన్ రీ ఎంట్రీ  ను కన్ ఫర్మ్ చేశాడు.  దిల్ రాజు తో  కలిసి  బోనీ  కపూర్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్  ను  పవన్ కళ్యాణ్ తో తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ చిత్రానికి ఎంసీఏ  ఫేమ్  వేణు శ్రీరామ్  దర్శకత్వం వహించనున్నాడు. ఈనెల  లో ఈ చిత్రం లాంచ్ అయ్యే అవకాశాలు వున్నాయి. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.



ఇక ఒరిజినల్ వెర్షన్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ , తాప్సి ప్రధాన పాత్రల్లో  నటించగా  2016 లో  విడుదలైన ఈ చిత్రం  100కోట్ల వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది.  సోషల్ మెసేజ్ తో  తెరకెక్కిన ఈ చిత్రం  విమర్శకులు  ప్రశంసలు కూడా  పొందింది. ఇక ఈ ఈచిత్రాన్ని  ఇటీవల కోలీవుడ్ లో 'నెర్కొండ పరవాయ్' అనే టైటిల్ తో రీమేక్ చేశారు.  తల అజిత్ నటించిన ఈచిత్రం ఇటీవల విడుదలై సూపర్ పాజిటివ్ రివ్యూస్ తో  ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి కోలీవుడ్ లో ఈ ఏడాది  బిగ్గెస్ట్  బ్లాక్ బాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈచిత్రాన్ని కూడా  బోనీ కపూర్  నిర్మించగా  ఖాకిఫేమ్  వినోత్ తెరకెక్కించాడు. మరి  ఇప్పుడు తెలుగు లో రీమేక్ లో అవుతున్న ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: