ఇక ఒరిజినల్ వెర్షన్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ , తాప్సి ప్రధాన పాత్రల్లో నటించగా 2016 లో విడుదలైన ఈ చిత్రం 100కోట్ల వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది. సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకులు ప్రశంసలు కూడా పొందింది. ఇక ఈ ఈచిత్రాన్ని ఇటీవల కోలీవుడ్ లో 'నెర్కొండ పరవాయ్' అనే టైటిల్ తో రీమేక్ చేశారు. తల అజిత్ నటించిన ఈచిత్రం ఇటీవల విడుదలై సూపర్ పాజిటివ్ రివ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి కోలీవుడ్ లో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈచిత్రాన్ని కూడా బోనీ కపూర్ నిర్మించగా ఖాకిఫేమ్ వినోత్ తెరకెక్కించాడు. మరి ఇప్పుడు తెలుగు లో రీమేక్ లో అవుతున్న ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.