వరస పరాజయాలతో సతమతమైపోతున్న
రవితేజ నటిస్తున్న లేటెస్ట్
మూవీ ‘డిస్కో రాజ’ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది అని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీని సుమారు 17 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేయాలి అని
నిర్మాత రామ్ తాళ్ళూరి భావిస్తే ఈ
మూవీ దర్శకుడు వి.ఐ.ఆనంద్ వ్యవహారశైలి వల్ల ఈ
మూవీ బడ్జెట్ 22 కోట్లు దాటేసింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ
మూవీ రిలీజ్ కు రెడీ అయిన నేపధ్యంలో ఈ
మూవీ ప్రమోషన్ నిమిత్తం ఖర్చు పెట్టవలసిన మొత్తాలు వడ్డీలు అన్నీ కలుపుకుంటే ఈ
మూవీ నిర్మాత నష్టాలు లేకుండా బయట పడాలి అంటే కనీసం ఈ మూవీని 25 కోట్ల రేంజ్ కి మించి
మార్కెట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు.
రవితేజ మూవీలకు బిజినెస్ ఏమాత్రం జరగని పరిస్థితులలో ప్రస్తుతం ఈ సినిమాను 25 కోట్ల స్థాయిలోమార్కేట్ చేయడం చాల కష్టం అన్న అభిప్రాయాలు
ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం
టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏ మాత్రం బాగానేని పరిస్థితులలో సీనియర్ హీరోల సినిమాలను చూసే ప్రేక్షకులు రోజురోజుకు తగ్గ పోతున్నారు. దీనికితోడు ప్రస్తుతం రావితేజాకు యూత్ లో కానీ అదేవిధంగా అమ్మాయిలలో కానీ ఎటువంటి క్రేజ్ లేని పరిస్థితిలో ఈ మూవీని నిర్మాతలు చెప్పిన భారీ రేట్లకు కొనడానికి బయ్యర్లు భయపదిపోతున్నారని టాక్.
దీనికితోడు ఈ మూవీలో
హీరోయిన్ గా నటించిన పాయల్
రాజ్ పుట్ కు
ఐరన్ లెగ్
హీరోయిన్ గా ముద్ర పడటంతో అటు హీరోకు ఇటు
హీరోయిన్ కు క్రేజ్ లేని మూవీని కొనడానికి ప్రస్తుతం ఎవరూ సాహసించక పోవడంతో ఈ మూవీని
డిసెంబర్ రేసు నుండి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సినిమాను అమ్మకుండా సరైన రిలీజ్ డేట్ దొరికినప్పుడు ఈ మూవేని విడుదల చేయాలని ఈ
మూవీ నిర్మాత రామ్ తాళ్లూరి భావిస్తున్నట్లు టాక్. ఈ
మూవీ కూడ పరాజయం చెందితే ఇక
రవితేజ కెరియర్ పూర్తి అయిపోయినట్లే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..