టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో నిర్మిస్తున్న ‘1' చిత్రం ఆడియో వేడుక ఈ నెల 19న విడుదల చేసేందుకు ఘనం గా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుకు ఉండే భారీ ఫ్యాన్ ఫాలోయింగును దృష్టిలో పెట్టుకుని టీవీల్లో లైవ్ టెలికాస్ట్ చేయడంతో పాటు కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలోకూడా అభిమానుల కోసం లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు.  అయితే ఈ లైవ్ షో ను థియేటర్లలో మహేష్ బాబు ‘1' ఆడియో వేడుక చూడాలనుకునే వారు రూ. 250 చెల్లించాలని తెలుస్తోంది. వీరికి టికెట్‌తో పాటు ఉచితంగా టీషర్టు, క్యాప్, క్యాలెంటర్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసారట. టిక్కెట్లు ఎక్కడ అమ్ముతారు? ఏయే థియేటర్లలో ఈ ఆడియో వేడుక ప్రసారం అవుతుంది? అనేది విషయాలు త్వరలో తెలియనున్నాయి అంటున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈసినిమా గోవా షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే అని తెలుస్తోంది. ఇక కేవలం ఒక ఐటమ్ సాంగ్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఆ షూటింగ్ పూర్తికావటంతో గుమ్మిడికాయ కొడతారని అంటున్నారు. డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్ చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి ఈసినిమాను తెగ చెక్కాడు.  మహేష్ కు కలిసి వచ్చిన సంక్రాంతి సెంటిమెంట్ ను ఆసరాగా తీసుకుని విడుదల అవుతున్న ఈ సినిమాపై మహేష్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థుతులలో 250లు టికెట్ పెట్టి ఆడియో వేడుక చేయడం సాహసం అని కొన్ని వర్గాలు అంటున్నా మహేష్ క్రేజ్ రీత్యా సినిమా ఆడియో విడుదల నుంచే మహేష్ అభిమానుల పైనే వ్యాపారం చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: