హిట్టు ప్లాప్ అని ఏం పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటున్నా "జయం"
సినిమా హీరో నితిన్. ప్రస్తుతం ఈ కుర్ర
హీరో బాగా క్రేజ్ ఉన్న
రష్మిక మందనతో కలిసి 'భీష్మ'
సినిమా చేస్తున్నాడు. అభినవ భీష్ముడిగా కనిపించనున్న
నితిన్ పెళ్లంటే ఆమడ దూరం పోయే పాత్ర లో నటిస్తున్నాడు. ఈ సినిమాకి టాగ్ లైన్ 'సింగిల్ ఫర్ ఎవర్'. ఇప్పటికే ఈ
సినిమా షూటింగ్ మొదలై నాలుగు నెలలు అవుతుంది.
అయితే ఇపుడు ఈ చిత్ర బృందం భీష్మ
సినిమా నుంచి ఫస్టు గ్లిమ్ప్స్ ను వదలనున్నారు. ఇందుకు గాను
నవంబర్ 7 వ తేది ఉదయం 10 గంటలకు ముహుర్తాన్ని నిర్ణయించారు. ఆ విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
వెంకీ కుడుముల దర్శకత్వంలో
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి
మణిశర్మ కొడుకు
మహతి సాగర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న
రష్మిక మందన్న నటించడం, మళ్ళీ ఇది
ప్రేమ కథా చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. నిజానికి
రష్మిక తన మొదటి
సినిమా అయినా 'చలో' ని
వెంకీ కుడుముల దర్శకత్వంలో చేసారు. నాగసౌర్య
హీరో గా నటించిన ఈ చిత్రం విజయం సాధించింది. మళ్ళీ ఇపుడు
రష్మిక వెంకీ తో చేస్తున్న భీష్మ
సినిమా హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఇక
నితిన్ గత 2 ఏళ్ళ సినీ జీవితం చూస్తే, చల్
మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం లో నటించారు. ఆ రెండు సినిమాలు అభిమానులను ఏ మాత్రం అలరించలేదు. అందుకే
నితిన్ కి ఇపుడు తప్పనిసరిగా ఒక హిట్టు కావాలి లేకపోతే అతని సినీ జీవితం ముగిసిపోయే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.