‘సాహో’ షాక్ నుండి తేరుకున్న ప్రభాస్ ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ ‘జాను’ షూటింగ్ ను ఈ వారం ప్రారంభించ బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ 30 శాతం వరకు పూర్తి అయిన పరిస్థితులలో మిగిలిన 70 శాతం షూటింగ్ ను ఇక పెద్దగా గ్యాప్ లు లేకుండా ఆరు నెలల లోపు పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ మూవీని విడుదల చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

మూవీ కథ 1980 కాలంనాటి పరిస్థితులకు ప్రతిబింబంగా ఉంటుంది కాబట్టి ఈ మూవీ సెట్స్ కూడ అలాగే డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో 1980 కాలంనాటి రైళ్ళు ఎలా ఉండేవో అలా కనిపించేలా రైలు పెట్టెలను డిజైన్ చేసి ఒక ప్రత్యేకమైన రైలు సెట్ లో ఈ మూవీ షూటింగ్ సుమారు రెండు వారాలు జరగబోతున్నట్లు టాక్.

ఈ మూవీకి సంబంధించిన కీలక నటీనటులు అందరు పాల్గొని ఈ షెడ్యూల్ లో ఈ మూవీ కథకు సంబంధించిన కీలక సన్నివేశాలు తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి మరొక ఆ సక్తికర విషయం లీక్ అయింది. ఈ మూవీలో ప్రభాస్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి ప్రభాస్ చేత దివాత్రాభినయం చేయించకుండా ప్రభాస్ తండ్రి పాత్రను మరో సీనియర్ నటుడి చేత చేయించాలి అని భావించినా ప్రభాస్ డానికి అంగీకరించకుండా ఈ మూవీలో తండ్రి పాత్రను కూడ తానే చేస్తానని ముందుకు వచ్చినట్లు సమాచారం. సుమారు 70 సంవత్సరాల వయస్సులో కనిపించే ఈ తండ్రి పాత్రలో ప్రభాస్ నెరిసిన తెల్లటి గెడ్డంతో కనిపిస్తాడని అంటున్నారు. గతంలో ‘ఆంధ్రావాల’ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇలా తండ్రి కొడుకుల గెటప్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి ప్రయోగాన్నే తన అభిమానులకోసం ప్రభాస్ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: