సినీ వర్గాలు ఎప్పుడో అనుకున్న కాంబినేషన్ ఇప్పుడు సెట్ అవ్వడానికి అవకాశం ఉందంటున్నారు . అందాల నటి
అనుష్క గురించి చెప్పాలి అంటే మాటలు సరిపోవు ఎన్నో గొప్ప పాత్రలలో నటించి మంచి పేరును తెచ్చి పెట్టుకుంది . దాదాపు రెండేళ్లకు పైగా ఈ స్వీటీ
వెండి తెరపై కనిపించలేదు. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ
సైరా నరసింహారెడ్డి అనే తెలుగు చిత్రంలో ఝాన్సీరాణిగా మెరిసి తన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా నటిస్తున్న సైలెన్స్ (తెలుగులో నిశ్శబ్దం) చిత్రం చిత్ర ప్రచారం మొదలైంది.
ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి,ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం,
హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందించారు . బుధవారం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి దర్శకులు ,నిర్మాతలు ప్రయతిస్తున్నారు . దీంతో
అనుష్క నెక్ట్స్ చిత్రం ఏమిటన్న ప్రశ్న తలెత్తుంది. ఈ విషయాన్ని అటుంచితే మరో సంచలన దర్శకుడు గౌతమ్మీనన్. ఈయన ఈ మధ్య నటుడిగా కూడా మారారు.
దర్శకుడిగా చేసిన చిత్రాలే తెరపైకి వచ్చి చాలా కాలమైంది, అయితే ధ్రువనక్షత్రం, ఎన్నై నోక్కి పాయుమ్ తూటా చిత్రాలు చాలా కాలంగా నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో రెండు మూడు సార్లు ధనుష్ మేఘాఆకాశ్ జంటగా నటించిన ఎన్నై నోక్కి పాయుమ్ తూటా చిత్రం విడుదల తేదీలు వాయిదా పడ్డా, ఈ సారి మాత్రం కచ్చితంగా రావడానికి రెడీ అవుతోంది. దీన్ని
నిర్మాత ఐసరిగణేశ్ తన చేతుల్లోకి తీసుకుని ఈ నెల 29వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇదే
నిర్మాత దర్శకుడు గౌతమ్మీనన్తో వరుసగా రెండు చిత్రాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం. అందులో ఒకటి జోష్వా ఇమై పొయ్ ఖాఖా. ఇందులో వరుణ్రాహెల్ జంటగా నటించనున్నట్లు తెలిసింది.
నటి అనుష్క రెండవ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంగా ఉంటుందట. తాను తదుపరి చిత్రం గౌతమ్మీనన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్టు నటి
అనుష్క భాగమతి చిత్రం ప్రమోషన్లో భాగంగా చెన్నైకి వచ్చినప్పుడు వెల్లడించింది. అయితే ఆ తరువాత ఆ చిత్రం గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు . సైలెన్స్ చిత్రాన్ని పూర్తి చేసిన అనుష్కకు ఇన్నాళ్లకు అప్పుడు కమిట్ అయిన గౌతమ్మీనన్ దర్శకత్వంలో నటించడానికి సెట్ అవుతుందా అన్న ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.