నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయంది ఈ అందాల
భామ రాశీ ఖన్నా. తొలి సినిమాలో కాస్త బొద్దుగా కనిపించినా తన అందం అభినయంతో ప్రేక్షకుల అందరిని దృష్టిని ఆకర్షించింది ఈ భామ. అయితే తొలి
సినిమా సూపర్ హిట్ అయిన మరో సక్సెస్ చూసేందుకు ఈ భామకు రెండుళ్లు పట్టింది అంటే నమ్మండి.
ఇక వరుసగా జోరు, జిల్, శివం, బెంగాల్ టైగర్ సినిమాలు ప్లాప్ అవ్వటంతో ఈ ముద్దు గుమ్మ కెరీర్ బాగా కష్టాల్లో పడ్డట్టే అనుకున్నారు అంతా కానీ సుప్రీం సినిమాతో మరో సక్సెస్ను అందుకొని టాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం దక్కించుకుంది. అదే జోరులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జై లవ కుశ సినిమాలో
హీరోయిన్ గా నటించింది. కానీ ఈ విజయం తర్వాత అయినా తరువాత కూడా స్టార్ హీరోలెవరూ రాశీకి అవకాశం ఇవ్వలేదు.
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా మీడియం రేంజ్ హీరోల సినిమాలతోనే సరిపెట్టుకుంటుంది రాశీ. కానీ రాశీ మాత్రం ఇంకా టాలీవుడ్లోనే స్టార్ ఇమేజ్ కోసం పోరాడుతోంది. ఇటీవల కోలీవుడ్లోనూ అడుగుపెట్టిన ఈ
బ్యూటీ అక్కడ కూడా బిజీగా ఉంది. రెండు
తమిళ సినిమాలతో పాటు మూడు తెలుగు సినిమాలో నటించే అవకాశాలు లభించాయి. తెలుగులో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న
వెంకీ మామ, సాయి ధరమ్ తేజ్ హీరోగా
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిరోజు పండగే సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల్లో నటిస్తోంది ఈ భామ.
అయితే ఇటీవల తన సోషల్
మీడియా పేజ్లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ను పోస్ట్ చేయడం జరిగింది రాశీఖన్నా. ఇన్నేళ్ల కెరీర్లో ఏ తెలుగు సినిమాకు డబ్బింగ్ చెప్పని రాశీ, వరల్డ్ ఫేమస్ లవర్
సినిమా కోసం తన పాత్రకు డబ్బింగ్ ఇస్తుంది అని సమాచారం. ఇటీవల డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించిన రాశీ తన ఫోటోను
ట్విట్టర్ వేదికగా అందరికి తెలియచేసింది. తొలిసారిగా తన గళం వినిపిస్తున్న ఈ
బ్యూటీ ఎంత వరుకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.