గత కొన్ని రోజులుగా ప్రముఖ యాంకర్ ప్రదీప్ గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రదీప్ తీవ్ర అనారోగ్యం పాలయ్యాడని కొందరు, ప్రదీప్ కాలునొప్పి వలన టీవీషోలకు దూరంగా ఉంటున్నాడని కొందరు, ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోకు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ప్రదీప్ ఢీ షోకు దూరమయ్యాడని కొందరు వార్తలు ప్రచురించారు. 
 
యాంకర్ ప్రదీప్ తన ఆరోగ్యంపై, తనపై వస్తున్న వార్తల గురించి స్పందించాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్‌లో ప్రదీప్ మాట్లాడుతూ యూట్యూబ్ లో తన గురించి వస్తున్న వార్తలు చదివి టైమ్ పాస్ అయిందని చెప్పాడు. చాలామంది ఫ్యాన్స్ యూట్యూబ్  వీడియోల వలన కంగారు పడ్డారని ప్రదీప్ అన్నారు. నా కాలుకు ఫ్రాక్ఛర్ అయిందని అందువలన కాలునొప్పి ఎక్కువ కావడంతో కొంతకాలం డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పారని ప్రదీప్ చెప్పాడు. 
 
అతి త్వరలోనే షోలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ప్రదీప్ చెప్పాడు. మా అమ్మానాన్నలకు నేను ఇంట్లో ఉండటం ఎంతో సంతోషంగా ఉందని ప్రదీప్ చెప్పాడు. ఒక షో షూటింగ్ సమయంలో కాలు బెణికిందని ప్రదీప్ చెప్పాడు 10 సంవత్సరాల యాంకరింగ్ జర్నీలో చాలా తక్కువ సందర్భాల్లో బ్రేక్ దొరికిందని దీవాళీ పండుగ, పుట్టినరోజు అమ్మానాన్నలతో కలిపి సంతోషంగా జరుపుకున్నానని ప్రదీప్ చెప్పాడు. 
 
చాలా మంది నా ఆరోగ్యం బాగుండాలని సందేశాలు పంపారని త్వరలోనే షోలలో పాల్గొనాలని కోరుకున్నారని ప్రదీప్ చెప్పాడు. కొత్త కొత్త షోలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ప్రదీప్ చెప్పాడు. ఢీ షోలో త్వరలోనే పాల్గొంటానని ప్రదీప్ చెప్పాడు. డిఫరెంట్ స్టైల్ కోసం గడ్డం పెంచుతున్నాని, ఖాళీగా ఉన్నాను కాబట్టి కోతి పనులు చాలానే చేసానని ప్రదీప్ చెప్పాడు. యూట్యూబ్ లో కొంతమంది హెడ్డింగ్స్ మాత్రం భలే పెట్టారని దిగ్భ్రాంతి అని పరిస్థితి విషమం అని పెట్టారని అన్ని వీడియోలు నేను చుశానని ప్రదీప్ అన్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: