టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి వ‌స్తోన్న రెండు సినిమాల్లో మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాపై ఎంత‌లా అంచ‌నాల ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మహేష్ బాబు తన కెరీర్లో తొలిసారి మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, రత్నవేలు ఫోటోగ్రఫిని, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.


అనిల్ రావిపూడి ఇప్ప‌టికే నాలుగు వ‌రుస హిట్ల‌తో తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. సుకుమార్ లాంటి డైరెక్ట‌ర్‌ను కాద‌ని మ‌రీ మ‌హేష్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. ఇక మహేష్, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు పోస్టర్స్ ఇప్పటికే రిలీజ్ అయి అడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది.


ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్‌లో న‌డుస్తోంది. టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల లెక్క‌ల ప్ర‌కారం స‌రిలేరు ఓవర్సీస్ హక్కులు గ్రేట్ ఇండియా ఫిలింస్ వారు కొద్దిరోజుల క్రితం భారీ ధరకు దక్కించుకున్నారు. ఇక ఏపీ, తెలంగాణ‌తో పాటు క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు లాంటి చోట్ల రైట్స్ కోసం బ‌య్య‌ర్లు పోటాపోటీగా ముందుకు వ‌స్తున్నారు. దీంతో రేట్లు కూడా పెరిగిపోతున్నాయి.


నైజాం రైట్స్‌ను ఇండ‌స్ట్రీకే చెందిన ఓ బ‌డా నిర్మాత భారీ రేటు ఇచ్చి మ‌రీ సొంతం చేసుకునేందుకు రెడీగా ఉన్నాడ‌ట‌. మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక హీరో, డైరెక్ట‌ర్ ఇద్ద‌రు వ‌రుస హిట్ల‌తో జోరు మీద ఉండ‌డంతో ట్రేడ్ వ‌ర్గాల‌కు కూడా ఈ సినిమాపై బాగా గురి ఉంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ సినిమా రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: