శ్రీరెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. స్టార్ అవుదామనుకొని వచ్చి యూట్యూబ్ స్టార్ గా బాగా పేరును సంపాదించుకుంది. దీనితో అనుకున్నది ఒకటి అయినది మరొకటిలాగా ఆమె వ్యవహారం ఉంది. ఈమె బ్యాగ్ గ్రౌండ్ ఎలా ఉన్న కానీ, చాలామంది అమ్మాయిలకు మేలు చేసిందనే చెప్పాలి. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలో ఒక పోరాటాన్ని చేసిన ఈమె సినీ ఇండస్ట్రీలో పెద్ద స్టార్, యూత్ ఐకాన్ అయినా పవన్ కళ్యాణ్ పై రాళ్ళూ రువ్వి అయన ఫ్యాన్స్ దాటికి తట్టుకోలేక చెన్నైకి చెక్కేసింది. 


ఇక అక్కడకు వెళ్లినా కూడా కుదురుగా ఉండలేదు. అక్కడ కూడా వాడు అలాంటి వాడు అంటూ మల్లి అక్కడి అగ్ర హీరోలను టార్గెట్ చేసింది. తమిళ తమ్ముళ్లు మాత్రం తెలుగు వాళ్ళలా కాకుండా కాస్త ఎక్కువగానే ఆమెకు బాధిత పూజ చేశారు. దానితో ఆమె యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఇండస్ట్రీలో ఉన్న బడాబాబులను గెలుకుతూ వచ్చింది. ఇంకా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అందరిపై రాళ్ళూ వేస్తూ వస్తుంది. 


వివరాల్లోకి వెళితే పూనమ్ తాజాగా ఓ పోస్ట్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అబద్దాలు చెప్పే వారు గొప్ప రాజకీయ వేత్త కాలేరు.. పవన్ ని ఉద్ద్యేశించి చేసిన పోస్ట్ కు స్పందించిన శ్రీ రెడ్డి.. తన స్టయిల్లో మతాల యుద్ధం చేస్తుంది. ఆమె ఎంటర్ అయింది అంటే ఇంకా మ్యాటర్ కాస్త రసపట్టులాగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 


ఇది ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ సినిమాలో శ్రీరెడ్డి నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. వర్మ తాజాగా నటిస్తున్న చిత్రం కమ్మరాయంలో కడప రెడ్లు సినిమాలో వివాదాస్పద నటి శ్రీ రెడ్డి కీలక పాత్రలో నటిస్తుందని వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమంటున్నాయి. ఈ వార్త కనుక నిజమైతే శ్రీరెడ్డి ఇంకా వరుస సినిమాలో నటిస్తుందని సమాచారం. అయితే, ఎదానికోసమైతే శ్రీరెడ్డి ఇన్ని విమర్శలు చేస్తూ వచ్చింది. దానితో ఆమె కల ఇప్పటికి నెరవేరింది. ఇంకా రెచ్చిపోతుంది అని చాలా మంది అంటున్నారు. సినిమాలు లేనప్పుడే ఈ అమ్మడు అమితమైన అందాలను ఆరబోస్తూ వచ్చింది. ఇంకా ఇప్పుడు ఆగుతుందా అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: