యువ కథానాయకుడు
సందీప్ కిషన్ గత కొన్ని రోజులుగా విజయాలు లేక ఇబ్బంది పడుతున్నాడు. మొన్నటికి మొన్న వచ్చిన "నిను వీడని నీడని నేనే" చిత్రం బాగానే ఉన్నపటికీ ప్రేక్షకుల ఆదరణ అంతగా దక్కలేదన్నది వాస్తవం.
సినిమా హిట్ అని చెప్పుకుంటున్నా కలెక్షన్లు డల్ గా వచ్చాయని సమాచారం. దాంతో
సందీప్ కిషన్ మరో సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. అయితే ఇప్పుడు కామెడీతో వస్తున్నాడు.
ఫుల్ అండ్ ఫుల్
కామెడీ ఎంటర్ టైన్ చేసేందుకు "తెనాలి రామక్రిష్ణ" బీఏబిఎల్ అనే టైటిల్ తో మన ముందుకు వస్తున్నాడు. ఇటివల వచ్చిన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది.
సందీప్ కిషన్ ఇంతకుముందు సినిమాలతో పోల్చితే ఈ సినిమాకి బాగా బజ్ వచ్చింది. ట్రైలర్ ప్రేక్షకులకి నచ్చడంతో ఈ
సినిమా విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నాడు
సందీప్ కిషన్. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ హైలైట్ అవుతుందట.
క్లైమాక్స్ ని బాగా తీర్చిదిద్దారట. ముఖ్యంగా
సందీప్ కిషన్ విలన్స్ పై తన వ్యూహాలను ఉపయోగించే విధానం, అలాగే క్లైమాక్స్ లో ప్రధానంగా వచ్చే స్కూటర్ ఎపిసోడ్ బాగా నవ్విస్తాయని తెలుస్తోంది. అదే విధంగా ఈ క్లైమాక్స్ ప్రేక్షకులకు చాలా కొత్తగా కూడా అనిపిస్తోందట. కాగా
నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది ఈ
కామెడీ ఎంటర్టైనర్. మరి ఈ
సినిమా ఆ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పిస్తుందా లేదా చూడాలి.
జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో
హన్సిక కథానాయికగా నటిస్తుంది. వరలక్ష్మి
శరత్ కుమార్ ఒక ప్రముఖ పాత్రలో నటిస్తుంది.సంగీత దర్శకుడు
సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తుండగా అగ్రహారం నాగి రెడ్డి, సంజీవరెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.