ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త అయిన గల్లా జయదేవ్ తన కుమారుడు గల్లా అశోక్ను హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఈ
సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో నిర్వహించిన ఈ గ్రాండ్ ఈవెంట్కు సుమారు రూ.25 లక్షలు ఖర్చుపెట్టినట్టు సమాచారం.
ఇదిలా ఉంటే, ప్రారంభోత్సవమే ఇంత గ్రాండ్గా చేస్తే
సినిమా ఇంకెంత గ్రాండియర్గా తీస్తారనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. అసలే వేల కోట్ల రూపాయలకు అధిపతులు. అలాంటి ఫ్యామిలీ నుంచి వస్తోన్న తొలి
హీరో అంటే కచ్చితంగా లాంచింగ్ అదిరిపోతుందనే టాక్ మొదలైంది. ఈ సినిమాపై కోట్లు కుమ్మరించడం ఖాయమని అంటున్నారు. కానీ, అలాంటిదేమీ జరగదట. తన కుమారుడు
అశోక్ లాంచింగ్ విషయంలో గల్లా జయదేవ్ చాలా క్లారిటీగా ఉన్నారట.
అక్కినేని వారసుడు
అఖిల్ తొలి సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. అలాగే, ప్రముఖ
నిర్మాత బెల్లంకొండ
సురేష్ కుమారుడు బెల్లంకొండ
శ్రీనివాస్ డెబ్యూ ఫిల్మ్ ‘అల్లుడు శీను’ బడ్జెట్ రూ.45 కోట్లు. వీళ్లంతా భారీగా డబ్బులు కుమ్మరించి చేతులు కాల్చుకున్నారు.అయితే, ఈ విషయంలో గల్లా ఫ్యామిలీ చాలా తెలివిగా ముందడుగు వేస్తోందని
ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న టాక్. భారీగా డబ్బులు కుమ్మరించి చేతులు కాల్చుకోవడానికి అయితే వీరు సిద్ధంగా లేరని సమాచారం. నటీనటులు, సాంకేతిక వర్గం రెమ్యునరేషన్ మినహా
సినిమా నిర్మాణానికి రూ.3.5 కోట్ల బడ్జెట్ను మాత్రమే గల్లా జయదేవ్ కేటాయించారట. మొత్తంగా అన్ని ఖర్చులు కలుపుకుని
సినిమా బడ్జెట్ రూ.10 కోట్లని అంటున్నారు.
తక్కువ బడ్జెట్తో మంచి ఔట్పుట్ను తీసుకొచ్చి రిస్క్ లేకుండా హిట్టు కొట్టాలని గల్లా ఫ్యామిలీ చిత్ర యూనిట్కు సూచించిందని టాక్. ఎందుకంటే, తమ ఫ్యామిలీ మెంబర్ అయిన
మహేష్ బాబు
సూపర్ స్టార్ హోదాలో ఉన్నారు. ఆయన సపోర్ట్ ఎలాగూ అశోక్కి ఉంటుంది. కాబట్టి, భారీ బడ్జెట్కు పోయి.. ఆ తరవాత విమర్శలు ఎదుర్కొని రచ్చ చేసుకునే బదులు. తక్కువ బడ్జెట్తో ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తే బాగుంటుందని భావిస్తున్నారట.