మహేష్ బాబు
సినిమా అంటే కోట్లలో ఉంటుంది.
మహేష్ రెమ్యునరేషన్ తో కలుపుకొని దాదాపుగా చాలా అవుతుంది. ఇక
సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సినీ వారసుల
సినిమా డెబ్యూ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరక్కించి చేతులు కాల్చుకున్నారు. బాక్సాఫీస్ వద్ద సినిమాలు ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. అక్కినేని వారసుడు
అఖిల్ మొదటి సినిమాకు దాదాపుగా రూ. 40 కోట్లు ఖర్చు చేశారు.
దీంతో గల్లా ఫ్యామిలీ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది.
సినిమా ఓపెనింగ్ మహోత్సవం కోసం ఈ ఫ్యామిలీ రూ. 25 లక్షలు గుమ్మరించింది. ఓపెనింగ్ గ్రాండ్ గా చేయడంతో..
సినిమా కూడా ఈ స్థాయిలోనే ఉంటుందని అనుకున్నారు. కానీ,
సినిమా షూటింగ్ కోసం కేవలం 3.5 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో
హీరోయిన్ గా చేస్తున్న ఇస్మార్ట్
బ్యూటీ నిధికి పారితోషికం కింద రూ.
కోటి రూపాయలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
అలానే దర్శకుడు
శ్రీరామ్ ఆదిత్య రెమ్యునరేషన్ మూడు కోట్లు, మిగతా టెక్నికల్ టీమ్ పారితోషికాలు కలుపుకొని మొత్తంగా రూ. 10 కోట్లలో సినిమాను ముగించేస్తున్నారట. వేలకోట్ల రూపాయలకు అధిపతులైన గల్లా ఫ్యామిలీ తన కుమారుడు
సినిమా కోసం కేవలం రూ. 10 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారా అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యం వేసినా అంతకంటే ఎక్కువగా ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదట.