దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్. సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తూ ఉండగా ఎన్టీయార్ కు జోడీ ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. 2020 జులై 30వ తేదీన ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదల కాబోతుంది. కానీ ఇప్పటివరకు ఎన్టీయార్ కు హీరోయిన్ ను ఫైనల్ చేయకపోవటంతో ఎన్టీయార్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. 
 
మొదట జూనియర్ ఎన్టీయార్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ ను రాజమౌళి ప్రకటించాడు. కానీ కొన్ని రోజుల తరువాత ఈ సినిమాలో నటించటం లేదని చెప్పి డైసీ ఆర్.ఆర్.ఆర్. చిత్ర యూనిట్ కు షాక్ ఇచ్చింది. ఆ తరువాత ఈ సినిమాలో అమెరికాకు చెందిన ఎమ్మారాబర్ట్స్ నటించనుందని వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాదని కేవలం పుకార్లు మాత్రమేనని తెలిసింది. 
 
మరో నాలుగు, ఐదు నెలల్లో ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ పూర్తి కాబోతుంది. ఆ తరువాత ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కు సంబంధించిన పనులు జరుగుతాయి. ఇప్పటికే సగభాగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఆర్.ఆర్.ఆర్. సినిమాలో ఇప్పటికీ ఎన్టీయార్ కు హీరోయిన్ ను ఫైనల్ చేయకపోవడంతో ఎన్టీయార్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. రాజమౌళి హీరోయిన్ ను ఫైనల్ చేసి ఉంటే హీరోయిన్ వివరాలను ప్రకటించాలని ఎన్టీయార్ అభిమానులు కోరుతున్నారు. 
 
ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తూ ఉండగా జూనియర్ ఎన్టీయార్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని వస్తున్న వార్తలపై రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు. అనుకున్న ప్రకారమే షూటింగ్ జరుగుతోందని సినిమా వాయిదా పడే అవకాశం లేదని రామ్ చరణ్ చెబుతున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: