టాలీవుడ్ లో ఉన్న బ్రేక్ కోసం చూస్తున్న యూత్ హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఉన్నాడు. ఇండస్ట్రీ టాప్ సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు మేనల్లుడే సందీప్. చేసే ప్రతి సినిమాలో తనకంటూ ఓన్ మేనరిజమ్స్, స్పెషల్ ఉండేలా చూసుకుంటాడు. ప్రస్థానం, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి హిట్స్ తర్వాత మరే సినిమా కూడా ఈ హీరోకు సక్సెస్ ఇవ్వలేదు. కానీ.. ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ శుక్రవారం తెనాలి రామకృష్ణ.. ఎల్ఎల్ బీ అనే సినిమాతో మరోసారి తన లక్ ను ట్రై చేసుకోబోతున్నాడు.

 


తెనాలి రామకృష్ణ తర్వాత ఏ వన్ – ఎక్స్ ప్రెస్ అనే సినిమా చేస్తున్నాడు. హాకీ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమాకు సందీప్ కిషన్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఓ హాకీ స్టేడియంను రెంట్ కు తీసుకుందట సినిమా బృందం. సినిమా కథ రీత్యా హాకీ మ్యాచ్ లు, ప్రేక్షకులు అవసరం ఉండటంతో స్టేడియంను రెంట్ కు తీసుకోవడమే మేలని భావించి యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందట. సినిమా కథ కూడా నేషనల్ లెవల్ కంటెంట్ తో ఉంటుందని సమాచారం. ఈ సినిమా కథ నచ్చే తానూ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని సమాచారం.

 


క్రీడా ప్రాధాన్యం ఉన్న సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అలా బేస్ చేసుకునే దర్శకుడు ఈ కథ రాసుకున్నాడట. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. తనూ ఓ హాకీ ప్లేయర్ గా నటిస్తోంది ఈ సినిమాలో. సినిమాకు సంగీతం హిప్ హాప్ తమిజ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: