రష్మిక మందన్న ఇప్పుడు
టాలీవుడ్ లో టాప్ రేంజ్ కు ఎదుగుతున్న హీరోయిన్. ఈ
హీరోయిన్ ఇప్పుడు తెలుగులో రెండు పెద్ద సినిమాలు చేస్తున్నది. అందులో ఒకటి
మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ కాగా, రెండో
సినిమా అల్లు అర్జున్,
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 20 వ సినిమా. ఈ రెండు సినిమాలు ఆమె కెరీర్లో పెద్ద సినిమాలే అని చెప్పాలి.
రాజమౌళి లాగానే
సుకుమార్ కూడా పర్ఫెక్షన్ పై ఎక్కువ దృష్టిపెడతాడు. అందుకే
సినిమా అంటే పర్ఫెక్ట్ గా రావాలి అని ట్రై చేస్తుంటాడు.
రష్మిక ఈ మూడు సినిమాలు తప్ప మరో సినిమాకు సైన్ చేయలేదు. ఎందుకు ఏమిటి అన్నది తెలియాల్సి ఉన్నది. మొదట్లో రష్మీక ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు లేకపోడం విశేషం. ఎందుకో ఆ దూకుడును ఆమె ప్రదర్శించలేకపోతున్నది.
కారణాలు ఏంటి అన్నది తెలియడం లేదు. పైగా ఇటీవలే ఈ అమ్మడు కొన్ని ట్రోల్స్ ను కూడా ఎదుర్కొన్నది. ఆమె ఫోటోను పెట్టి నానారకాలుగా రాశారని మండిపడింది. నిజమే కదా ఎవరైనా పర్సనల్ లైఫ్ లో వేడిపెడితే ఊరుకుంటారా చెప్పండి. ఎంతటి
సినిమా వాళ్లైనా సరే ఎందుకు ఊరుకుంటారు. ఏదోకటి అనేస్తారు కదా. అందుకే పాపం ఈ
హీరోయిన్ కూడా పెద్దగా ఈ విషయంలో కొంత వెనకడుగు వేసినట్టుగా కనిపిస్తోంది.