ప్రముఖ హీరో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నిన్న రాత్రి ఆయనను హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హాస్పటల్ లో జాయిన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా న్యూమోనియా వ్యాధితో బాధ పడుతున్న కృష్ణంరాజుకు వాతావరణంలో వచ్చిన మార్పులతో ఒకేసారి ఆయన ఆరోగ్యంలో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది.

తెలుస్తున్న సమాచారం మేరకు నిన్న అంతా ఐసియూ లో ఉంచిన కృష్ణంరాజును ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్యం కొంత వరకు కుదుట పడటంతో ఆయనను జనరల్ వార్డ్ కు మార్చి ఆయన ఆరోగ్యం పై మరింత లోతైన పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారడంతో చాల మంది కృష్ణంరాజు సన్నిహితులు ఆయన ఆరోగ్యం గురించి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం కృష్ణంరాజు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ తిరిగి ప్రభాస్ ను హీరోగా చేసి తన సొంత బ్యానర్ పై ఒక భారీ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణంరాజు తనకు ఏదైనా ఒక గౌరవప్రదమైన పదవి కోసం ఎదురు చూసారు.

అయితే సంవత్సరాలు గడుస్తున్నా కృష్ణంరాజుకు ఎటువంటి పదవి రాకపోవడం ఆయనకు కొంత వరకు మానసికంగా షాక్ ఇచ్చింది అని అంటారు. 79 సంవత్సరాల వయసులో ఉన్న కృష్ణంరాజు తన అనారోగ్య సమస్యల నుండి త్వరగా కోలుకుని తిరిగి యాక్టివ్ లైఫ్ లోకి రావాలని ఆయన అభిమానులతో పాటు ప్రభాస్ అభిమానులు కూడ కోరుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే నగరం లోనే ఉన్న ప్రభాస్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలు తెలుసుకుని డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఎప్పటికైనా ప్రభాస్ తో ‘భక్తకన్నప్ప’ మూవీని రీమేక్ చేయాలి అన్న కృష్ణంరాజు కోరిక తీరాలని ఆశిద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి: