సెన్సేషనల్ డైరక్టర్ నుంచి కాంట్రవర్సియల్ డైరక్టర్ గా మారిపోయాడు రామ్ గోపాల్ వర్మ. తాను టార్గెట్ చేస్తే ఎంత చిన్న విషయాన్నైనా పెద్దది చేయగలడు.. పెద్ద విషయాన్ని సంచలనం చేయగలడు. ఇక వ్యక్తులను టార్గెట్ చేస్తే వర్మ వేసే సెటైరికల్ పంచ్ లను తట్టుకోవడం వారి తరం కాదు. ఇందులో రామూను కొట్టేవారు లేరంటే అతిశయోక్తి కాదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబును టార్గెట్ చేసిన వర్మ.. ఇప్పుడు తీస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలో లోకేశ్ ను టార్గెట్ చేశాడు.
ఇటివల రిలీజ్ చేసిన టీజర్ లో చంద్రబాబు తనయుడు లోకేశ్ కు పప్పు వడ్డించే సీన్ ఎంతగా పేలిందో తెలిసిన విషయమే. ఇప్పుడు మరోసారి లోకేశ్ ను టార్గెట్ చేస్తూ మరో పిక్ వదిలాడు. లోకేశ్ తన కుమారుడు దేవాంశ్ తో ఆడుకుంటున్నట్టు ఉన్న ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ క్యాప్షన్ గా.. ‘బాలల దినోత్సవ శుభాకాంక్షలు.. ఈ ఫోటో కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలోనిది’ అని రాసాడు. ఈ ఫోటోలో చంద్రబాబు కూడా ఉన్నాడు. చంద్రబాబు తన మనవడి వంక కాకుండా లోకేశ్ వంక బాధగా చూస్తున్నట్టున్నట్టుగా ఉండేలా జాగ్రత్త తీసుకున్నాడు.ఈ ఫోటోను గమనిస్తే చంద్రబాబు, లోకేశ్ పై ఎంత వ్యంగ్యం ఉందో అర్ధమవుతుంది.
ప్రత్యేకించి బాలల దినోత్సవం సందర్భంగా ఈ ఫోటోను పోస్ట్ చేయడంతో నెటిజన్లకు పని దొరికినట్టైంది. ఈ ఫోటోపై కామెంట్లు వరదలా వచ్చేశాయి. టీడీపీ అభిమానులు వర్మను తిడుతుంటే.. వైసీపీ అభిమానులు మెచ్చుకుంటున్నారు. ‘వెటకారం మతమైతే వర్మ దేవుడు..’ ‘ఏ సందర్భాన్నైనా వాడుకోవడంలో నిన్ను మించినవాడు లేడు..’, ‘చిన్న పిల్లల్ని కూడా వదలవా..’ అంటూ కామెంట్లు వచ్చాయి.
Happy Children’s Day photo from kadapa REDDLU' target='_blank' title='kamma rajyamlo kadapa reddlu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>kamma rajyamlo kadapa reddlu #KRKR pic.twitter.com/UfvVklviG0
— ram gopal varma (@RGVzoomin) November 14, 2019