‘బ్రహ్మోత్సవం’ మూవీ ఫెయిల్యూర్ తో శ్రీకాంత్ అడ్డాల చెప్పే కథను వినడానికి కూడ హీరోలు భయపడిపోతు అతడిని దూరం పెడుతున్నారు. వాస్తవానికి ఈ క్రియేటివ్ డైరెక్టర్ చెప్పిన ఒక కథ అల్లు అరవింద్ కు నచ్చినప్పటికీ అతడితో సినిమాను తీయడానికి అరవింద్ భయపడిపోతున్నాడు. 

ఇలాంటి పరిస్థితులలో శ్రీకాంత్ అడ్డాలకు వెంకటేష్ పిలిచి అవకాశం ఇవ్వడం ఇండస్ట్రీ హత టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు వెంకటేష్ నటించబోతున్న ‘ఆసురం’ రీ మెక్ కు శ్రీకాంత్ అడ్డాల దర్శకుడుగా ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి ఈ సినిమా రీమేక్ కు సంబంధించి రకరకాల పేర్లు పరిశీలనలోకి వచ్చినా వెంకటేష్ మాత్రం శ్రీకాంత్ అడ్డాల పై మొగ్గు చూపడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. వెంకటేష్ తో ఈ దర్శకుడు తీసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ నుండి వెంకీకి శ్రీకాంత్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్నట్లు టాక్. ఆ అభిమానమే ఇతడిని ‘అసురాన్’ రీమేక్ విషయంలో ఎంపిక చేసుకునే విధంగా మారింది అని అంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి వెంకటేష్ పక్కన హీరోయిన్ గా శ్రియను ఎంపిక చేయాలి అని భావిస్తుంటే శ్రీకాంత్ మాత్రం శ్రియ స్థానంలో అనుష్కను ఎంపిక చేయమని వేకటేశ్ పై ఒత్తిడి పెడుతున్నట్లు టాక్. 

అయితే సాఫ్ట్ మూవీలో తీయడంలో శ్రీకాంత్ అడ్డాల ‘అసురన్’ లాంటి ఒక ఒక పవర్ ఫుల్ మూవీని హ్యాండిల్ చేయగలడా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి. అయితే అనుష్క ఈ మూవీలో హీరోయిన్ గా నటించాలు అంటే భారీ పారితోషిక డిమాండ్ ను అంగీకరించ వలసి ఉంటుంది, వెంకటేష్ మూవీకి బడ్జెట్ పెరిగిపోతే ఆ తరువాత మార్కెటింగ్ సమస్యలు ఏర్పడతాయి. దీనితో వెంకీ పక్కన అనుష్క ఎంపిక అనుకున్నంత సులువు కాదు అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: