ఈటీవిలో హైపర్ ఆదికి నాగబాబు వార్నింగ్ జబర్దస్త్ కామెడీ షోకి కావాల్సింది నీట్ కామెడీ. ఈ  విషయంలో హైపర్ ఆదికి తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే కదా. ఆది స్కిట్ల విషయంలో మాత్రం పెర్ఫార్మెన్స్ కంటే... పంచులు ఏం వేస్తున్నాడా అని తెలుసుకోవడానికే జనాలు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఇటీవల ఆది దూకుడు మరీ ఎక్కువైపోయింది.  దీంతో జబర్దస్త్ కామెడీ షోలో కీలకమైన జడ్జి నాగబాబు ఆదికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు? 


ఇంతకీ అసలేం జరిగింది?  ఆది గ్యాప్ లేకుండా పంచులపై పంచులు వేసేస్తున్నాడు. ఒక పంచ్ వేశాక, అదేంటని గ్రహించి, అర్థం చేసుకొని, దానికి నవ్వుకునే లోపే... మరో రెండు మూడు పంచులు పడిపోతున్నాయి. దాంతో నవ్వే గ్యాప్ కూడా ప్రేక్షకులకు దొరకట్లేదు. చివరకు మరీ ఇంత స్పీడ్ అవసరమా అనే పరిస్థితి వచ్చేస్తోంది. నవ్వే గ్యాప్ కూడా ఇవ్వట్లేదని జబర్దస్త్ కామెడీ షోలోని మరో జడ్జి అయిన రోజా చెప్పిన సందర్భాలెన్నో ఉన్నాయి.

ఈ విషయాన్ని గ్రహించిన నాగబాబు.. స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. మరీ అంత వేగం వద్దనీ... పంచులు, డైలాగ్స్ మధ్య కాస్త గ్యాప్ ఉండేలా చూడాలని సూచించినట్లు తెలిసింది.  హైపర్ ఆదికి తెలుగు భాషపై మంచి పట్టుంది. పల్లెల్లో ప్రజలు మాట్లాడుకునే డైలాగ్స్, యాస అన్నీ అతనికి వెన్నతో పెట్టిన విద్య అయ్యాయి. దానికి తోడు... ప్రతి విషయాన్నీ సెటైరికల్‌గా మాట్లాడటం ఆదికి అలవాటైంది. ఇందులో కాస్త కామెడీ రూట్ వెతుక్కున్న ఆది... స్టేజ్ ఎక్కగానే... పంచుల ప్రవాహం సాగిస్తున్నాడు. 


ఈ పంచులు జనానికి అర్థం కానప్పుడు... అర్థం చేసుకునే టైమ్ ఇవ్వనప్పుడు ఎన్ని వేసినా వేస్టే అనే భావన వస్తోంది. అందుకే ఇకపై హైపర్ ఆది స్కిట్లలో పంచుల వేగం కాస్త తగ్గిస్తాడని తెలిసింది. వేగం తగ్గినా... వేసే విషయంలో మాత్రం వెనక్కి తగ్గడని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: