లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా కెరీర్ ప్రారంభించినా పరిశ్రమలో తనదైన మార్క్ వేసింది అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్. వరుస అఫర్లతో క్షణం తీరిక లేకుండా ఎడాపెడా సినిమాలు చేసేసింది. హిందీ చిత్రం 'లక్'తో తెరంగేట్రం చేసి అది లక్ ను ఇవ్వకపోయినా, టాలీవుడ్ లో గబ్బర్ సింగ్ ఇచ్చిన ఊపు అంతా ఇంతా కాదు.అప్పుడు అప్పుడు పాటలతో ,ఘాటు అయినా ఫోటో షూట్ల తో పిచ్చి ఏకించేది.

Image

 

అయితే ఆ తరువాత మంచి ఫామ్ లోకి వస్తుందనుకున్న శృతిహాసన్ క్రమ క్రమంగా సినిమాలు తగ్గించుకోవడం మొదలుపెట్టింది. గత కొంత కాలంగా మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా వుంటూ వచ్చింది.బాయ్ ఫ్రెడ్ తో బ్రేకప్ తరువాత మళ్లీ సినిమాల పరంగా జోరు ఈ మధ్య పెంచింది. తమిళంలో విజయ్ సేతుపతి నిర్మాతగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన శృతిసినిమా ప్రొడక్షన్ లో వుండగానే మళ్లీ వరుస ఆఫర్లని సోంతం చేసుకుంటూ మళ్ళీ యమ బిజీ అయిపోతోంది ఈ భామ.

 

తాజాగా తెలుగులో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న `కిరాక్` చిత్రాన్ని అంగీకరించింది ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుంది శృతి హాసన్. ఈ సినిమా మాస్ మహారాజ్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపించబోతున్నారు. ఈ సినిమాతో పాటు శృతి టాలీవుడ్ లో మరిన్ని పెద్ద ప్రాజెక్ట్ ల కోసం స్కెచ్ వేస్తోందట. దీంతో ఇక పై ఈ అమ్మడు చరణ్-బన్ని-ప్రభాస్- ఎన్టీఆర్ వంటి స్టార్లకు అందుబాటులోకి వచ్చినట్టేనని అందరు భావిస్తున్నారు.

 

అయితే గ్యాప్ వల్ల ఫేడవుట్ అన్న టాక్ వచ్చేశాక వీళ్లంతా తనకు అవకాశాలిస్తారా? అన్నది వేచి చూడాలి.  అయితే అగ్ర హీరోయిన్ హోదాలో వెలిగిపోయిన శ్రుతిహాసన్ వ్యక్తిగత జీవితం కోసం అన్నిటినీ కాదనుకుంది. వదులుకుని వెళ్లిపోయి చేజేతులారా చేసుకుంది. అయితే ఇప్పుడు ఎలా కంబ్యాక్ అవుతుంది? అన్నది ఆసక్తికరం

మరింత సమాచారం తెలుసుకోండి: