టాలీవుడ్ లోకి ‘జోష్’ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయిన నాగ చైతన్య మొదటి సినిమాతో నిరాశపడ్డాడు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య,సమంత జంటగా నటించిన ‘ఏం మాయ చేసావే’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ట్విస్ట్ ఏంటేంటే ఈ మూవీలో రిల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఈ జంట ప్రేమలో పడటం పెద్దలను ఒప్పటించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం చైతూ - సమంత లు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘మజిలీ’ సూపర్ హిట్ అయ్యింది.
ప్రస్తుతం చైతూ తన మేనమామ విక్టరీ వెంకటేష్ తో కలిసి బాబీ దర్శకత్వంలో ‘వెంకిమామ’ సినిమాలోనటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఈ మూవీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రాబోతున్నాడు. చైతు బర్త్డే సందర్భంగా నవంబర్ 23న ఉదయం 10.30 నిమిషాలకు హీరో క్యారెక్టర్ ని పరిచయం చేసే ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇక శేఖర్ కమ్ముల ఫిదా తో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఫిదా మూవీతో సాయి పల్లవి కి కూడా మంచి క్రేజ్ లభించింది.
తన ప్రపంచంలో కి ఆయన బర్త్ డే సందర్భంగా మనల్ని అహ్వానిస్తున్నాడు చైతు. అక్కినేని అభిమానులకు, సినిమా అభిమానులకు కొత్త ఎక్స్ పీరియన్స్ గా ఉంటుందని తెగ సంబరపడిపోతున్నారు. ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.