డైరక్టర్ పరుశు రామ్ సినిమా జర్నీ గమ్యం తెలియని ప్రయాణంలా కొనసాగుతూనే ఉంది. ‘గీత గోవిందం’ లాంటి భారీ సక్సస్ అందుకున్నా ఇప్పటికి చాలామంది హీరోలు ఇతడిని ఒక ఫ్లూక్ డైరెక్టర్ గా పరిగణిస్తూ ఇతడు చెప్పే కధలు వింటూ ఉన్నా ఆ కధలను ఒకే చేయలేక పోతున్నారు. ఇప్పటికే మహేష్ ప్రభాస్ అల్లు అర్జున్ లు పరుశు రామ్ ఎన్ని కధలు చెప్పినా ఇంటికి పిలిచి గౌరవిస్తున్నారు కాని పట్టించు కోవడంలేదు. 

ఇలాంటి పరిస్థితులలో 14 రీల్స్ నిర్మాణ సంస్థ పరుశు రామ్ కు ఒక భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఇప్పటికే పరుశు రామ్ ప్రభాస్ కు చెప్పిన ఒక కథకు కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఆకధను చైతన్యకు వినిపించినట్లు తెలుస్తోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ కథను చైతు విని తన నిర్ణయం తరువాత చెపుతాను అని చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో రంగంలోకి దిగిన 14 రీల్స్ నిర్మాణ సంస్థ పరుశు రామ్ కు ఒక భారీ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కథకు పరుశు రామ్ చైతన్యను ఒప్పించ గలిగితే పరుశు రామ్ కు 8 కోట్ల పారితోషికంతో పాటు లాభాలలో వాటా కూడ ఇస్తామని 14 రీల్స్ నిర్మాతలు ఆఫర్ చేసినట్లు టాక్. 

దీనితో పరుశు రామ్ మరింత రెట్టించిన ఉత్సాహంతో చైతన్యను బుట్టలో వేసుకోవడానికి చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రయత్నాలకు అల్లు అరవింద్ సహకారం కూడ తీసుకుంటున్నట్లు టాక్. వాస్తవానికి అరవింద్ తనకు ‘గీత గోవిందం’ లాంటి భారీ హిట్ ఇచ్చిన పరుశు రామ్ కు సహాయపడాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నా అతడి ప్రయత్నాలు కూడ పరుశు రామ్ విషయంలో ఫెయిల్ కావడం ఆశ్చర్యంగా మారింది.. 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: