ఇలియానా అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ఆమె సన్నని నడుము.. 14 ఏళ్ల క్రితం తెలుగు ప్రేక్షకులకు దేవదాసు సినిమా ద్వారా పరిచయం అయ్యి అందరి మనసులో ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. పోకిరి సినిమా తర్వాత ఆమెకు తెలుగు ఇండస్ట్రీ లో ఎన్నో సినీ ఆఫర్స్ తన్నుకు వచ్చాయి. కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్ గా రికార్డుకెక్కింది. ఆమె తెలుగు సినిమాలతో పాటు ఎన్నో హిందీ సినిమాలలో నటించి మంచి హిట్లు సాధించింది. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఇలియానా తన గురించి ఎన్నో విషయాలను బయట పెట్టింది.

గతంలో ఆమె నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో చాలా లావుగా కనిపించారు. అయితే ఈ ఇంటర్వ్యూలో... తాను అలా లావు కావడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించినప్పుడు.. ఇలియానా ఇలా చెప్పుకొచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం తాను ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ అయిన ఆండ్రూ తో
పీకల్లోతు ప్రేమలో పడి.. అతన్నే వివాహం చేసుకోవాలనుకుందని చెప్పింది. కానీ తన ప్రేమ విఫలమవడంతో తాను చాలా డిప్రెషన్ కు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ. అటువైపు సినిమా ఛాన్సులు రాక... ఇటు వైపు తన ప్రేమ ఘోరంగా విఫలమై ఒక నరకయాతన అనుభవించిందంట ఈ 'కిక్' హీరోయిన్.

ఒకానొక సమయంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు విపరీతంగా వచ్చేవట.
దీంతో ఆమె తన ప్రాణాంతక డిప్రెషన్ నుంచి బయటపడడం కోసం ఒక మానిసిక చికిత్సను తీసుకోవడం ప్రారంభించిందని... ఆ సందర్భంలోనే ఒకానొక రోజు నిద్ర పట్టక ఒకేసారి 12 నిద్రమాత్రలు వేసుకుందని చెప్పుకొచ్చింది. అలా కొన్ని రోజులపాటు నిద్రమాత్రలు తరచుగా వాడటం వల్ల ఆమె బరువెక్కిందని.. చెప్పుకొచ్చింది. ఎంతో పట్టుదలతో మళ్లీ వ్యాయామశాల కు వెళ్లి మొదటిలో లాగా చాలా సన్నబడి తనంటే నిరూపించింది. కానీ ఆమె వ్యాయామశాలకు వెళ్లే టైంలో... ఫోటోగ్రాఫర్స్ తన ఫోటోను తీసి ఎంతో ఇబ్బందికి గురి చేసివారని.. ఆ ఫొటోస్ నెట్టింట హల్చల్ అయ్యేవన్నారు. తాను లావుగా ఉన్న ఫొటోస్ చూసి నెటిజన్లు ట్రోల్ చేసి ఆమె మనసును గాయపరిచారని బాధపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: