సరిలేరు నీకెవ్వరూ సినిమా టీజర్ కోసం చాలా రోజుల నుంచి మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఎట్టకేలకు ఈరోజు సాయంత్రం రిలీజ్ చేశారు.  నవంబర్ 23 వ తేదీన అనిల్ రావిపూడి పుట్టినరోజు కావడంతో సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు.  మహేష్ బాబు కాశ్మీర్లో ఆర్మీమేజర్ గా, స్కూల్ పిల్లలను రక్షించే ఎపిసోడ్ ను చూపించారు.  మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూలో ఎలా ఉండబోతున్నారు.  


అయన హీరోయిజం ఎలా ఉండబోతుంది.  ఎలా క్యారెక్టర్ ఏంటి.. క్యారెక్టరైజేషన్ ఏంటి అన్నది ఇందులో స్పష్టంగా చూపించారు.  ఆర్మీలో మేజర్ స్థాయిలో ఉన్న వ్యక్తి హైదరాబాద్ వచ్చిన తరువాత విజయశాంతితో పరిచయం ఏర్పడిందా లేదంటే విజయశాంతితో బంధుత్వం ఉన్నదా అన్నది పక్కన పెడితే.. ఎదో ఒక కీలకమైన విషయం కోసమే అజయ్ కృష్ణ కాశ్మీర్ నుంచి కర్నూల్ వరకు వస్తాడు.  


సినిమాలోని మెయిన్ పాత్రలను టీజర్ లో ఇంట్రడ్యూస్ చేశారు.  కానీ, ఇందులో  క్యారెక్టర్ ను చూపించలేదు.  అదే రష్మిక మందన్న.  రష్మికకు మహేష్ బాబు అంత కాకపోయినా.. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నది.  కర్ణాటకలో ఆమెకు మంచి పేరు ఉన్నది.  కానీ, ఈ టీజర్ లో కనీసం ఒక్క సెకండ్ ఫ్రేమ్ లో కూడా ఆమె ను చూపించలేదు.  ఎందుకు ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది.  


అజయ్ పాత్రను హైలైట్ చేస్తూ రెండు మూడు ఫ్రేమ్స్ లో చూపించారు.  రాజకీయ నాయకుడిగా ప్రకాష్ రాజ్ ను చూపించారు.  ఇక విజయశాంతిని చూపించారు.  కానీ రష్మికను మాత్రం చూపించలేదు.  ఇది టీజర్ లో రష్మిక గురించి చూపించక పోవడంతో ఆమె ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.  రష్మికకు అన్యాయం జరిగిందని ఫాన్స్ ఫీల్ అవుతున్నారు. రష్మిక కోసం మరో టీజర్ రిలీజ్ చేస్తారా.. ఏమో చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: