బుల్లితెర చరిత్రలో దక్షిణ భారతదేశం లోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు పొంది ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న 'ఢీ', ఇప్పటికి పదకొండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుందీ ఈ షో. మొదటి సీజన్ నుండి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతూ సాగుతుంది ఈ అల్టిమేట్ డ్యాన్స్ షో. 'ఢీ' ద్వారా శేఖర్, గణేశ్, జానీ, రఘు, యశ్వంత్ ఇలా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచమయ్యారు. అందుకే ఈ షో అంత పాపులర్ అయింది. తాజాగా ఈ షోలో ఓ ఊహించని పరిణామం జరిగింది. దీనితో అందరూ ఒక షాక్‌ కు గురవుతున్నారు. ఇంతకీ ఏంటా పరిణామం అనుకుంటున్నారా..? పూర్తి వివరాల్లోకి వెళితే..

 

ఇప్పటికే పదకొండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ ‘ఢీ' షో పన్నెండో సీజన్‌ ని కూడా ప్రారంభించింది. ‘ఢీ చాంపియన్స్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో గతంలో ఈ షో ద్వారా పాపులర్ అయిన డ్యాన్సర్స్, కొందరు ఛాంపియన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్ పోటీపోటీగా జరుగుతోంది. అందుకే గతంలో ఉన్న ఫ్యాన్స్ కంటే ఈ సీజన్‌కు మరింత మంది ఎక్కువ అభిమానులు వచ్చి చేరుతున్నారు.

 

‘ఢీ' అంటే డ్యాన్స్ షో అనుకుంటే మాత్రం పొరపాటే. ఈ రియాలిటీ షోలో యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, రష్మీ సహా జడ్జులు అందరూ కలిసి స్టేజ్‌ పై నవ్వులు పూయిస్తుంటారు. అందుకే ఇది ఆల్‌ రౌండ్ షో అయిపోవడం జరిగింది. ముఖ్యంగా యాంకర్ ప్రదీప్ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది ఈ షోలో. అయితే, ఇటీవల అతడు ఈ షోకు దూరం అయ్యాడు. దీంతో అతడి స్థానంలో మరో యాంకర్ రవి, వర్షిణి షోలోకి ఎంటర్ అవ్వడం జరిగింది.

 

‘ఢీ చాంపియన్స్' మొదలైన తర్వాత దీనికి కూడా గత సీజన్ల వలే భారీ స్పందన వస్తుంది అనుకున్నారు. కానీ, తర్వాత పరిస్థితి అలా కనిపించలేదు. దీనికి కారణం కంటెంట్‌ తో పాటు యాంకర్ ప్రదీప్ గైర్హాజరు అవడం కూడా. అలా అలా నెట్టుకుంటూ వచ్చిన ఈ షో ఇప్పుడిప్పుడే కాస్త క్లిక్ అవుతోంది. దీంతో ప్రేక్షకులు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఢీ షో వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోను సదరు చానెల్‌ విడుదల చేసింది. ఇందులో జడ్జ్‌ ల్లో ఒకరైన హీరోయిన్ పూర్ణకు ఢీ కంటెస్టెంట్ రాజుతో ఎంగేజ్మెంట్ అయినట్లు చూపించారు. ఇందులో రాజు మోకాళ్లపై కూర్చుని పూర్ణ వేలికి ఉంగరం తొడిగేసాడు. దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: